Pragya Jaiswal : మోడల్గా కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత పలు సినిమా ఛాన్స్లు అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. విరట్టు అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అభిజీత్ నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు ‘కంచె’తో రీలాంచ్ అయింది. ఈ సినిమాకు పలు అవార్డ్లు రావడంతో ప్రగ్యాకి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ అమ్మడు నటించిన ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్లను అందుకోలేకపోయింది.
ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్టు సమాచారం. రీసెంట్గా బాలయ్యతో కలిసి ప్రగ్యా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఈ అమ్మడు తాజాగా కరోనా బారిన పడింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ అమ్మడు కరోనా బారిన పడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రగ్యా జైస్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రగ్యా జైస్వాల్ ఫాలోవర్లను భారీ స్థాయిలో పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ఒక్కోసారి పిక్స్ కూడా షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…