Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి గతంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి. ఈ హీరో హీరోయిన్ల మధ్య ఒక విషయం గురించి తీవ్ర స్థాయిలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, అందుకే ప్రభాస్ ఒక పాటలో హీరోయిన్ తో కలిసి నటించడం లేదని ఏదో అలా మేనేజ్ చేశారని చెప్పుకొచ్చారు.
ఈ విధంగా ప్రభాస్ గురించి వస్తున్న వార్తలను తన పీఆర్ టీమ్ తీవ్రంగా ఖండించింది. తన గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై ప్రభాస్ప రోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది. అందుకే ఈ పాత్ర కోసం బాగా ఆలోచించి పూజా హెగ్డెను ఎంపిక చేశామని తెలిపారు.
ప్రేమ కథా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఇలా ఈ సినిమాలో తనకు పూజా హెగ్డెకు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ప్రభాస్ ఇలా సమాధానం చెప్పడంతో పరోక్షంగా పూజా హెగ్డెతో తనకు ఏ విధమైనటువంటి మనస్పర్థలు లేవని క్లారిటీ ఇచ్చినట్లు అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…