Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాలన్నీకూడా భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నాయి. అయితే ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాల బడ్జెట్ కలిపితే రూ.1000 కోట్ల పైమాటే. దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రకటించిన ప్రాజెక్ట్ కె బడ్జెట్ రూ. 500 కోట్లు. ఇక ఇటీవల అనౌన్స్ చేసిన ప్రభాస్ 25వ చిత్రం స్పిరిట్ కూడా భారీ బడ్జెట్తో రూపొందనుందని సమాచారం.
స్పిరిట్ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్తో ఢీ అంటే ఢీ అనే లేడీ విలన్గా కరీనా కపూర్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆమెతో ఫైట్ సీన్లలో ప్రభాస్ నటించనున్నాడట. ఇప్పుడు ప్రభాస్ హీరోగా చేస్తోన్న ‘ఆది పురుష్’లో సైఫ్ ఆలీఖాన్.. రావణాసురుడిగా నటించాడు. కాగా ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలో కరీనా కపూర్ విలన్గా నటిస్తుందని తెలుస్తోంది.
భారీ యాక్షన్ బ్యాక్డ్రాప్లో స్పిరిట్ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్ పొందుతున్నాడని బీ టౌన్ టాక్. ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల భారీ పారితోషికం అందుకోనున్నాడని టాక్ వినిపిస్తోంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…