Balakrishna Car :టాలీవుడ్ సీనియర్ స్టార్స్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇన్నాళ్లూ వెండితెరపై సందడి చేసిన ఆయన ఇప్పుడు బుల్లితెరపై రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ టాక్ షో ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ ఓ లగ్జరీ కారులో రాగా.. ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.
బాలయ్య కారు కంపెనీ పేరు బెంట్లీ కాగా.. ఈ కారును బాలకృష్ణకు ఆయన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కారు విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ ఈ కారులోనే ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఇక ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో 12 ఎపిసోడ్లుగా ప్రసారం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్కు రూ.50 లక్షల చొప్పున రూ.6 కోట్ల వరకు బాలయ్య పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
సినిమాల విషయానికి వస్తే నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను యాక్షన్ ఫిల్మ్ అఖండ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. విడుదలకు రెడీ అవుతోంది. దీంతో బాలయ్య తదుపరి సినిమాపై ఫోకస్ చేశారట. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలయ్య మరోసారి ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథలో మొత్తం రాయలసీమ, కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…