Balakrishna Car :టాలీవుడ్ సీనియర్ స్టార్స్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇన్నాళ్లూ వెండితెరపై సందడి చేసిన ఆయన ఇప్పుడు బుల్లితెరపై రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ టాక్ షో ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ ఓ లగ్జరీ కారులో రాగా.. ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.
బాలయ్య కారు కంపెనీ పేరు బెంట్లీ కాగా.. ఈ కారును బాలకృష్ణకు ఆయన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కారు విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ ఈ కారులోనే ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఇక ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో 12 ఎపిసోడ్లుగా ప్రసారం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్కు రూ.50 లక్షల చొప్పున రూ.6 కోట్ల వరకు బాలయ్య పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
సినిమాల విషయానికి వస్తే నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను యాక్షన్ ఫిల్మ్ అఖండ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. విడుదలకు రెడీ అవుతోంది. దీంతో బాలయ్య తదుపరి సినిమాపై ఫోకస్ చేశారట. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలయ్య మరోసారి ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథలో మొత్తం రాయలసీమ, కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…