Posani Krishna Murali : నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ చేస్తుంటారు. దీంతో ఆయన వివాదాల్లో నిలుస్తుంటారు. అప్పట్లో పవన్ ఏపీ ప్రభుత్వం, మంత్రులపై చేసిన కామెంట్లకు పోసాని స్పందించారు. దీంతో కొందరు వ్యక్తులు పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఆ తరువాత ఆ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా మళ్లీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పోసాని కృష్ణమురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాను పరుచూరి బ్రదర్స్ దగ్గర సుమారుగా 5 ఏళ్ల పాటు పనిచేశానని పోసాని తెలిపారు. ఆ సమయంలోనే తనకు మోహన్ బాబుతో పరిచయం అయిందని అన్నారు. అయితే పరుచూరి బ్రదర్స్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని.. కానీ వారిలా మాత్రం బతకాలని కోరుకోవడం లేదని అన్నారు. వాళ్లకు అసలు బతకడం అంటే ఏమిటో తెలియదని, అలాంటి వాళ్లను ఇండస్ట్రీ ఎందుకు పక్కన పెట్టిందో తనకు తెలుసని అన్నారు.
అలాగే పరుచూరి, ఆత్రేయ, వేటూరి లాంటి వాళ్ళని చూసి ఈ బతుకు నాకు వద్దు అని అనుకున్నానని తెలిపారు. కనీసం చనిపోయిన సమయంలోనూ పట్టుమని పది రాని ఇండస్ట్రీ గురించి తనకు బాగా తెలుసని, తనను ఇండస్ట్రీ నిషేధించినా ఫర్వాలేదు, తన సంతానం, వారి సంతానం బతికేంతగా సంపాదించానని తెలిపారు. కొందరికి మందు పోసి చికెన్ అందించే బతుకు తనకొద్దు అని పోసాని అన్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో చిరంజీవి జగన్ను కలిసిన అంశంపై ఆయనకు, మోహన్బాబుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దశలో పోసాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…