Pooja Hegde : ఎంతటి సెలబ్రిటీలు అయినా సరే కొన్ని సార్లు విమాన ప్రయాణాలు చేసినప్పుడు వారికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు కొందరు చూసీ చూడనట్లు వెళ్లిపోతారు. కొందరు మాత్రం ఈ విషయాన్ని నలుగురికీ చెబుతారు. తాజాగా పూజా హెగ్డె కూడా అలాగే చేసింది. ఆమెకు తాజాగా విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో అప్సెట్ అయిన బుట్టబొమ్మ తనకు ఏం జరిగిందో వివరించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది.
పూజా హెగ్డె తనకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలియజేసింది. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది విపుల్ నకాషే అనే వ్యక్తి తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసింది. తన పట్ల అతను ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని మండిపడింది. ముంబై నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో అతను తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. ఎలాంటి కారణం లేకున్నా.. తనతో అహంకారంగా, అజ్ఞానంగా మాట్లాడాడని.. తనను బెదిరింపులకు గురి చేశాడని.. ఆమె ఆరోపణలు చేసింది. అయితే ఇలాంటి విషయాలను తాను అంతగా పట్టించుకోనని.. కానీ తాజాగా జరిగింది మాత్రం భయంకరంగా ఉందని.. పూజా హెగ్డె ట్వీట్ చేసింది.
అయితే పూజా ట్వీట్పై సదరు విమాయాన సంస్థ స్పందించింది. తన స్టాఫ్ పేరు, వివరాలతోపాటు తన ఫ్లైట్, టిక్కెట్ నంబర్, పీఎన్ఆర్ నంబర్ తదితర వివరాలను తెలియజేయాలని.. వెంటనే అతనిపై చర్యలు తీసుకుంటామని.. ఈ విషయంలో సారీ చెబుతున్నామని.. ఇండిగో సంస్థ స్పష్టం చేసింది. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే పూజా ట్వీట్ మాత్రం వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె ఇటీవలే ఆచార్యలో నటించగా.. అది బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అంతకు ముందు వచ్చిన బీస్ట్, రాధే శ్యామ్ చిత్రాలు కూడా ఫెయిలయ్యాయి. దీంతో త్వరలో రానున్న మహేష్ చిత్రంపైనే ఈమె నమ్మకం పెట్టుకుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఎఫ్3 మూవీలో ఐటమ్ సాంగ్లోనూ మెరిసింది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…