Pooja Hegde : ఎంతటి సెలబ్రిటీలు అయినా సరే కొన్ని సార్లు విమాన ప్రయాణాలు చేసినప్పుడు వారికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు కొందరు చూసీ చూడనట్లు వెళ్లిపోతారు. కొందరు మాత్రం ఈ విషయాన్ని నలుగురికీ చెబుతారు. తాజాగా పూజా హెగ్డె కూడా అలాగే చేసింది. ఆమెకు తాజాగా విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో అప్సెట్ అయిన బుట్టబొమ్మ తనకు ఏం జరిగిందో వివరించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది.
పూజా హెగ్డె తనకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలియజేసింది. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది విపుల్ నకాషే అనే వ్యక్తి తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసింది. తన పట్ల అతను ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని మండిపడింది. ముంబై నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో అతను తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. ఎలాంటి కారణం లేకున్నా.. తనతో అహంకారంగా, అజ్ఞానంగా మాట్లాడాడని.. తనను బెదిరింపులకు గురి చేశాడని.. ఆమె ఆరోపణలు చేసింది. అయితే ఇలాంటి విషయాలను తాను అంతగా పట్టించుకోనని.. కానీ తాజాగా జరిగింది మాత్రం భయంకరంగా ఉందని.. పూజా హెగ్డె ట్వీట్ చేసింది.
అయితే పూజా ట్వీట్పై సదరు విమాయాన సంస్థ స్పందించింది. తన స్టాఫ్ పేరు, వివరాలతోపాటు తన ఫ్లైట్, టిక్కెట్ నంబర్, పీఎన్ఆర్ నంబర్ తదితర వివరాలను తెలియజేయాలని.. వెంటనే అతనిపై చర్యలు తీసుకుంటామని.. ఈ విషయంలో సారీ చెబుతున్నామని.. ఇండిగో సంస్థ స్పష్టం చేసింది. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే పూజా ట్వీట్ మాత్రం వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె ఇటీవలే ఆచార్యలో నటించగా.. అది బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అంతకు ముందు వచ్చిన బీస్ట్, రాధే శ్యామ్ చిత్రాలు కూడా ఫెయిలయ్యాయి. దీంతో త్వరలో రానున్న మహేష్ చిత్రంపైనే ఈమె నమ్మకం పెట్టుకుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఎఫ్3 మూవీలో ఐటమ్ సాంగ్లోనూ మెరిసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…