Points Table IPL 2021 : ప్రతి సీజన్లోనూ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్కు ఈ సీజన్లో గడ్డు పరిస్థితి వచ్చింది. ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశాలను ముంబై ఇంకా సంక్లిష్టం చేసుకుంది. అయితే ఇందులో ముంబై ప్రమేయం ఏమీ లేదు. కోల్కతా నైట్ రైడర్స్ ఎప్పుడైతే రాజస్థాన్పై 86 పరుగుల భారీ తేడాతో గెలిచిందో.. అప్పుడే ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్కతా జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో +0.587 నెట్ రన్ రేట్తో నాలుగో స్థానంలో నిలిచింది.
అయితే కోల్కతా అంతటి భారీ విజయం సాధించడంతో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సన్నగిల్లిపోయాయి. ఈ క్రమంలోనే ఇంకో మ్యాచ్లో రోహిత్ శర్మ సేన ముందుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టుపై 171 పరుగుల తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ముంబై ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలు పూర్తిగా క్లోజ్ అయ్యాయనే చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో 20 పాయింట్లతో ఆడిన 13 మ్యాచ్లలో 10 గెలిచి ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉంది. తరువాత 9 విజయాలతో 18 పాయింట్లతో చెన్నై రెండో స్థానంలో ఉంది. 8 విజయాలు, 16 పాయింట్లతో బెంగళూరు మూడో స్థానంలో ఉండగా.. 7 విజయాలు, 14 పాయింట్లతో కోల్కతా 4వ స్థానంలో ఉంది. అలాగే పంజాబ్, ముంబై, రాజస్థాన్, హైదరాబాద్లు వరుస స్థానాల్లో నిలిచాయి.
ఇక ఆరెంజ్ క్యాప్ నిన్న మొన్నటి వరకు డుప్లెసిస్ వద్ద ఉండగా.. కేఎల్ రాహుల్ అద్భుతమై 98 పరుగులతో ఆ క్యాప్ను తాను సొంతం చేసుకున్నాడు. అలాగే ఇప్పటి వరకు ఈ సీజన్లో 13 మ్యాచ్లలో 29 వికెట్లు తీసిన ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ సమీపిస్తుండగా.. ఏ జట్టు ఫైనల్ కు చేరి ట్రోఫీని లిఫ్ట్ చేస్తుందా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…