Plastic Surgery : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు టాలెంట్ తో పాటు ఆకట్టుకునే అందం కూడా ఉండాలి. ఆ అందం కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయించుకునే హీరోయిన్లపై బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు తమ నో ఫిల్టర్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాము మేకప్ వేసుకోలేదని టెక్నాలజీని వినియోగించి అందానికి మెరుగులు దిద్దలేదని కొంతమంది హీరోయిన్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు పెట్టడంలో గొప్ప ఏంటని రాధికా ఆప్టే ప్రశ్నిస్తున్నారు. నో ఫిల్టర్ ఫోటోలను షేర్ చేయడం బదులు ప్లాస్టిక్ సర్జరీలను ఆపాలని అన్నారు.
ఆ సర్జరీల వల్ల అందం పెరగడం ఏమో గానీ ఉన్న అందాన్ని చెడగొడుతున్నారని కామెంట్ చేశారు. సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి, శృతిహాసన్, సమంతలతో పాటు మరికొంతమంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్నారని, ఆ విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడరని.. ఇలా చేయించుకోవడం వల్ల కొంతమంది హీరోయిన్ల అందం పెరిగితే మరికొంతమంది అందం పాడైపోతుందని అన్నారు. ప్రతిఒక్కరికీ సహజంగా వచ్చిన అందమే నిజమైన అందం అని.. ప్లాస్టిక్ సర్జరీల వల్ల వచ్చిన అందం.. నిజమైన అందం కాదని.. అంటూ రాధిక ఆప్టే వ్యాఖ్యలు చేశారు. లెజెండ్ సినిమాలో హీరోయిన్ గా రాధికాకు మంచి గుర్తింపు వచ్చింది.
బాలీవుడ్ లో కూడా సినిమా ఆఫర్లు తగ్గాయి. వెబ్ సిరీస్ లో నటిస్తూ క్రేజ్ ని సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఎంతోమంది హీరోయిన్లు తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు ఎంతో ఖర్చు చేసి మరీ సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ పై ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…