Pawan Kalyan Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విజయం దక్కిన అనంతరం మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రకాష్ రాజ్ ప్యానెల్పై ఘాటుగానే విమర్శలు, ఆరోపణలు చేశారు. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రెస్మీట్ పెట్టి మీడియా ముందు ఏడవడంతో అందుకు ప్రతిగా విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రతి విమర్శలు చేశారు.
ఇక మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన సమయంలో మోహన్ బాబు పరోక్షంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారని.. ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే మా ఎన్నికలు పెట్టిన చిచ్చు.. ఇప్పట్లో ఆరిపోయేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణుకు చేదు అనుభవం ఎదురైంది. పవన్ కల్యాణ్ ఆయనకు షాక్ ఇచ్చారు.
గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా అనంతరం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా ఆయన ఆ కార్యక్రమం నిర్వహించారు. దానికి పవన్ కల్యాణ్, మంచు విష్ణు కూడా అతిథులుగా వచ్చారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. కానీ విష్ణు పవన్తో మాట్లాడేందుకు యత్నించారు. కానీ పవన్ పట్టించుకోనట్లు అలాగే ఉండిపోయారు.
అయితే మోహన్ బాబు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడారంటూ.. మెగా అభిమానులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కానీ తాజాగా మంచు విష్ణుకు ఎదురైన అనుభవం చూసి వారు హ్యాపీగా ఫీలవుతున్నారు. పవన్కు జై కొడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఇండస్ట్రీలో ఈ వివాదం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…