Parvati Melton : 2005వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించిన వెన్నెల చిత్రంతో హీరో రాజాతో కలిసి జంటగా నటించిన పార్వతీమెల్టన్ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో పార్వతీమెల్టన్ కి అంత గుర్తింపు రాకపోయినా పవన్ కళ్యాణ్ నటించిన జల్సాలో జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుందే అంటూ ఆడి పాడి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దూకుడు లో మహేష్ తోపాటు పూవాయ్ పూవాయ్ అంటాడు ఆటో అప్పారావు అంటూ మహేష్ తో జతకట్టి అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ ఇంట్రడక్షన్ తో పార్వతి అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ.
అందం, అభినయం ఉన్న పార్వతి మెల్టన్ ను గ్లామర్ లుక్ లోనే ప్రేక్షుకులు ఇష్టపడేవారు. కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వెన్నెల చిత్రం తర్వాత నటించిన గేమ్, అల్లరే అల్లరి తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎంత క్రేజ్ వున్నా తెలుగు సినిమాల్లో హీరోయిన్ స్థాయిలో అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన హల్లో చిత్రంలో నటించి అలరించింది. ఈ సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చివరగా 2012లో ఈ బ్యూటీ యమహో యమ అనే సినిమాలో కనిపించి ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పార్వతి మెల్టన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తన సినిమా కెరీర్ నాశనం కావడానికి ఇద్దరు దర్శకులు కారణమని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది. అయితే ఆ ఇద్దరు దర్శకుల పేర్లు మాత్రం ఆమె బయటకు వ్యక్తం చేయలేదు. అంతే కాకుండా 2013లో తాను శంసులాలానిని వివాహం చేసుకున్నట్టు తెలియజేసింది. ప్రస్తుతం భర్తతో కలిసి ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…