Parvati Melton : 2005వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించిన వెన్నెల చిత్రంతో హీరో రాజాతో కలిసి జంటగా నటించిన పార్వతీమెల్టన్ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో పార్వతీమెల్టన్ కి అంత గుర్తింపు రాకపోయినా పవన్ కళ్యాణ్ నటించిన జల్సాలో జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుందే అంటూ ఆడి పాడి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దూకుడు లో మహేష్ తోపాటు పూవాయ్ పూవాయ్ అంటాడు ఆటో అప్పారావు అంటూ మహేష్ తో జతకట్టి అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ ఇంట్రడక్షన్ తో పార్వతి అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ.
అందం, అభినయం ఉన్న పార్వతి మెల్టన్ ను గ్లామర్ లుక్ లోనే ప్రేక్షుకులు ఇష్టపడేవారు. కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వెన్నెల చిత్రం తర్వాత నటించిన గేమ్, అల్లరే అల్లరి తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎంత క్రేజ్ వున్నా తెలుగు సినిమాల్లో హీరోయిన్ స్థాయిలో అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన హల్లో చిత్రంలో నటించి అలరించింది. ఈ సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చివరగా 2012లో ఈ బ్యూటీ యమహో యమ అనే సినిమాలో కనిపించి ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పార్వతి మెల్టన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తన సినిమా కెరీర్ నాశనం కావడానికి ఇద్దరు దర్శకులు కారణమని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది. అయితే ఆ ఇద్దరు దర్శకుల పేర్లు మాత్రం ఆమె బయటకు వ్యక్తం చేయలేదు. అంతే కాకుండా 2013లో తాను శంసులాలానిని వివాహం చేసుకున్నట్టు తెలియజేసింది. ప్రస్తుతం భర్తతో కలిసి ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…