Oppo : మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను భారత్ లో విడుదల చేసింది. ఒప్పో రెనో 7 5జి, రెనో 7 ప్రొ 5జి పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ధరలు కూడా అందుబాటులోనే ఉండడం విశేషం.
ఒప్పో రెనో 7 5జి ఫోన్లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. అందువల్ల 5జికి సపోర్ట్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో లభిస్తుంది.
రెనో 7 5జి ఫోన్లో డ్యుయల్ సిమ్లతోపాటు ఒక మెమొరీ కార్డును కూడా వేసుకోవచ్చు. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అదనంగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను అందిస్తున్నారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్లో లభిస్తున్నాయి.
రెనో 7 ప్రొ 5జి ఫోన్లో.. 6.55 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి కూడా 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల ఇందులోనూ డిస్ప్లే అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లేకు కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. కనుక 5జి కి సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్వేరియెంట్లో విడుదలైంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను ఇందులో అందిస్తున్నారు.
రెనో 7 ప్రొ 5జి ఫోన్లో.. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ టైప్లో దీన్ని అందిస్తున్నారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. దీనికి తోడు అదనంగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఇందులో అందిస్తున్నారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు.
ఒప్పో రెనో 7 5జి ఫోన్ ధర రూ.28,999 ఉండగా.. దీన్ని ఫ్లిప్కార్ట్తోపాటు ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ నెల 17వ తేదీ నుంచి విక్రయించనున్నారు. అలాగే ఒప్పో రెనో 7 ప్రొ 5జి ఫోన్ ధర రూ.39,999 ఉండగా.. దీన్ని ఫిబ్రవరి 8వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…