NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఏదైనా బిగ్గెస్ట్ ప్లాన్ చేస్తున్నారా అంటే.. అవుననే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే కాలంలో పాలిటిక్స్ కోసం రెడీ అవుతున్నారట. 2024 ఎలక్షన్స్ కోసం తన ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడానికే ప్రముఖ టీవీ షోలో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ని చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ పేరులో నుండి జూనియర్ అనే పేరుని తీసేశారు.
ఎన్టీఆర్ అనే సంబోధించడంతో ఈ వార్తలకు మరింత ప్రాణం పోసినట్లయింది. ఎన్టీఆర్ ను తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్, తారక్ అనే పేర్లతో పిలుస్తారు. కానీ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రామ్ లో మీ రామారావు అంటూ సైన్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు బుల్లితెర టీవీ ప్రోగ్రామ్ లోనూ ఎన్టీఆర్ అనే పిలుస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మనవడిగా ఆయన పోలికలతో పాటు నటనను కూడా సొంతం చేసుకున్నారు ఈ హీరో.
ఈ ప్రోగ్రామ్ లో మరో హైలెట్ అయ్యే మాట ఏంటంటే.. ఎన్టీఆర్ ను మీలో ఎవరు కోటీశ్వరులు ప్రోగ్రామ్ కు వచ్చే మహిళలు అన్నయ్య అంటూ పిలుస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సరిపోయే అన్ని రకాల అంశాలు కనిపించేసరికి సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ అవుతున్నాయి. దీంతో ఈ షో ద్వారానే ఎన్టీఆర్ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్లు గుసగుసలాడుకుంటున్నారు. రాబోయే కాలంలో టీడీపీకి తనే ముందుండి నడిపించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారా.. అని అనుకుంటున్నారు. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరి ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…