అలా మొదలైంది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నిత్యామీనన్. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన క్యారెక్టర్ కు గుర్తింపు ఉండే చిత్రాలను ఎంచుకుంటూ నిత్యామీనన్ నటనపరంగా మంచి పేరును సంపాదించుకుంది. ఇటీవల కాలంలో నిత్యామీనన్ కు సినిమా ఆఫర్లు తగ్గాయనే చెప్పవచ్చు. తాజాగా నిత్యా మీనన్ నిర్మాతగా బాధ్యతలను చేపట్టారు. ఈ ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తిరుచిత్రాంబలం మూవీ.
ఈ చిత్రంలో హీరో ధనుష్ కి జంటగా నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఇలా ఉండగా, ఓ సందర్భంలో తను కూడా వేధింపులకు గురయ్యాను అని తెలియజేసి అందరినీ షాక్కు గురిచేశారు. సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం లాంటిది. ఈ రంగుల ప్రపంచం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అందులో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఫిమేల్ సినీ ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకని, తమ సమస్యలను బయటకు చెప్పకుండా లోపలే అణచివేసుకొనేవారు ఎంతో మంది ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అనేక మంది ఫిమేల్ ఆర్టిస్టులు ఎదుర్కొన్న సమస్యలు ఎప్పటి నుంచో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్టులే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా అనేక సమస్యలతో ఇండస్ట్రీలో సతమతమవుతున్నారు. నేను కూడా ఈ కోవకు చెందిన మహిళలలో ఒకదాన్ని.. అంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు నిత్యామీనన్.
కొంత కాలంగా సోషల్ మీడియాలో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యామీనన్ అంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే.. ఆరేళ్లుగా నన్ను ఒక సమస్య వేధిస్తోంది. సంతోష్ వర్గీస్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. గత ఆరేళ్ల నుంచి నన్ను అన్ పాపులర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ తన సమస్యపై ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమస్య పట్ల నా తల్లిదండ్రులు నాకు అండగా నిలవడంతో అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. సంతోష్ తో నా వివాహం అనే ప్రచారంలో వాస్తవం లేదని ఆవేదన వ్యక్తంచేశారు నిత్యామీనన్.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…