Niharika Konidela : మెగా డాటర్ కొణిదెల పేరు ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఈమె ఉగాది రోజు పబ్కు వెళ్లి అర్థరాత్రి వరకు అక్కడ ఉండడం ఏమోగానీ.. అందరూ నాగబాబును విమర్శించారు. డ్రగ్స్ తీసుకోలేదు సరే.. అంత రాత్రి పూట భర్త లేకుండా అది కూడా తెలుగు పండుగ రోజు ఒక తెలుగు యువతి పబ్లో ఏం చేస్తుంది ? ఉగాది పచ్చడి తింటుందా ? అని నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే అది గతం. ఆ సంఘటన తరువాత నిహారిక ఇంటికే పరిమితం అయింది. కానీ తాజాగా జిమ్లో వర్కవుట్స్ చేస్తూ కనిపించింది. ఇక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది.
డ్రగ్స్ కేసుకు ముందే నిహారిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డీయాక్టివేట్ చేసింది. ఆమె చివరిసారిగా అందులో ఫిబ్రవరి 27వ తేదీన పోస్ట్ పెట్టింది. అంటే సుమారుగా 2 నెలల అనంతరం మళ్లీ అందులో ఆమె తాజాగా ఇప్పుడే పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్ట్లో తన లేటెస్ట్ ఫొటోను షేర్ చేయడంతోపాటు దాని కింద ఓ కాప్షన్ కూడా పెట్టింది. తాను 8 వారాల అనంతరం ఇన్స్టాగ్రామ్లోకి మళ్లీ వచ్చానని.. ఈ బ్రేక్ తరువాత తాను ఎంతో రీఫ్రెష్గా ఫీలవుతున్నానని ఆమె తెలిపింది.
ఈ 8 వారాల ఇన్స్టాగ్రామ్ బ్రేక్లో తాను 3 పాఠాలను నేర్చుకున్నానని.. 1. ప్రపంచం అంతం కాలేదని, 2. ఇతరులు ఏమన్నా.. ఏం చేసినా తాను పట్టించుకోనని, 3. ఇప్పుడు కొత్త అనుభూతితో తాజాగా ఫీలవుతున్నానని.. నిహారిక పోస్ట్ చేసింది. దీంతో తనను విమర్శించిన వారికి ఆమె ఇలా కౌంటర్ వేసినట్లు పోస్ట్ పెట్టిందా.. అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లు చేస్తోంది. త్వరలోనే అవి విడుదల కానున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…