Anchor Suma : రెండు దశాబ్దాలుగా అటు బుల్లితెరను ఏలుతూ, ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరపైకి అడుగు పెట్టింది యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ చేస్తుంటుంది సుమ. సుమ సినిమా ఈవెంట్ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరు. అందరినీ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తూ.. కడుపుబ్బా నవ్విస్తుంది. ఒకరకంగా సుమ కోసమే కొందరు ఈవెంట్ చూస్తారు అంటే నమ్మశక్యం కాదు. పైగా సుమ వివాదాలకు చాలా దూరంగా ఉంటూ హీరోలందరితోనూ సత్సంబంధాలను కలిగి ఉంటుంది. అయితే ఇటీవల ఓ వివాదం సుమ మెడకు చుట్టుకుంది. అదేంటంటే..
గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ క్రెడిట్ కు సంబంధించి చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి అభిమానులు క్రెడిట్ మాదంటే మాదని సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా ఆస్కార్ ఆశించే 2023 నామినీ నటుల జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా ఉందని వార్తలు వచ్చాయి. ఇందులో రామ్ చరణ్ పేరు ఎక్కడా కనిపించలేదు. అంతర్జాతీయ మ్యాగజైన్ వెరైటీ 2023 ఆస్కార్ నామినీల జాబితాను విడుదల చేసింది. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు తారక్, చరణ్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మళ్లీ మొదలైంది.
ఇదిలా ఉండగా యాంకర్ సుమ తన గేమ్ షో లో అడిగిన ఓ ప్రశ్న అభిమానుల మధ్య విద్వేషాలు సృష్టించేదిగా మారింది. సుమ తన క్యాష్ ఎపిసోడ్లో సీనియర్ నటి అన్నపూర్ణమ్మను ఏ నటుడి నటన మిమ్మల్ని గర్వపడేలా చేసింది ? ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్.. అని అడగ్గా.. అన్నపూర్ణమ్మ ఏ మాత్రం తడబడకుండా.. అసలు ఎన్టీఆర్..! చరణ్ కూడా మంచి సపోర్ట్గా ఉన్నాడు.. అని చెప్పింది. ఈ క్రమంలోనే ఈ వీడియోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో ఇది ఇరువర్గాల అభిమానుల మధ్య గొడవలకు దారితీసింది. సుమ వివాదాలు సృష్టించే ఉద్దేశంతో ఆ ప్రశ్న అడగనప్పటికీ ఆల్రెడీ సెన్సిటివ్ గా ఉన్న ఇష్యూపై ప్రశ్నలు వేయడం ఏంటని మరికొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చూడాలి దీనికి సుమ ఏ విధంగా స్పందిస్తుందో..!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…