Pushpa : ఏ రచయిత, దర్శకుడైనా గానీ ఒక హీరోని తన దృష్టిలో పెట్టుకుని కథను మలచుకోవడం అనేది సర్వసాధారణం. ఈ హీరో అయితే ఈ చిత్రానికి సరిపోతాడు అనుకుంటూ ఊహించుకుంటూ కథని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్న వాటికి భిన్నంగా ఒక్కోసారి కథలో మార్పులు చేర్పులు చేయడం అనేవి సర్వసాధారణం. ఈ సమయాల్లో వారు ఊహించుకున్న స్టార్ హీరోకు బదులుగా మరొక హీరోని పెట్టి చిత్రాలను తీయవలసి వస్తోంది. అసలు విషయానికొస్తే.. డైరెక్టర్ సుకుమార్ పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
సుకుమార్ పుష్ప చిత్రానికి మొదటగా మహేష్ బాబు హీరోగా అనుకొని కథను మలుచుకోవడం జరిగిందట. అంతే కాకుండా మహేష్ బాబుకి పుష్ప చిత్ర కథను వినిపించడం కూడా జరిగింది. మహేష్ బాబుకు కథ నచ్చకపోవడంతో నేను ఇలాంటి మాస్ క్యారెక్టర్ కు సెట్ కానని వెంటనే నో చెప్పేశారట. ఈ చిత్రం కాస్త అల్లు అర్జున్ ని వరించింది. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని సక్సెస్ను అందుకున్నాడు.
అదే విధంగా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం రంగస్థలం. రంగస్థలం చిత్రంలో రామలక్ష్మి పాత్రలో సమంత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో సుకుమార్ పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రకు మొదట సమంత అని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల సమంత పుష్ప చిత్రాన్ని రిజక్ట్ చేయడంతో ఆ లక్కీ చాన్స్ కాస్తా రష్మికను వరించింది. సమంత మాత్రం ఊ అంటావా మామ.. ఉహూ ఉంటావా మామ అనే స్పెషల్ సాంగ్ లో చాన్స్ దక్కించుకుని దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది.
ఈ పాటతో ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది సమంత. ఈ పాటకు కూడా మొదట్లో దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ ముద్దుగుమ్మలైన నోరా ఫతేహి, దిశా పటానిలను అనుకున్నారట. వీరు ఈ పాటలో నటించడానికి భారీగా డిమాండ్ చేయడంతో ఆ ఛాన్స్ ను సమంత కొట్టేసింది. పుష్ప చిత్రంలో చివరగా విలన్ గా ఎంట్రీ ఇచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు కూడా మొదటిగా విజయ్ సేతుపతిని అనుకున్నారు. విజయ్ సేతుపతి డేట్స్ సెట్ కాకపోవడంతో ఈ పాత్ర కాస్తా ఫహద్ ఫాసిల్ ని వరించింది. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వదులుకొని మంచి బ్లాక్ బస్టర్ ని తమ చేతులారా పోగొట్టుకున్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…