Nellore Chepala Pulusu : మన తెలుగువారంటేనే భోజనప్రియులు అని వేరే చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు అంటే తెగ పడి చచ్చిపోతారు. ఆంధ్ర వంటకాలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మన వంటకాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా చేపల పులుసు పెట్టడంలో మన వాళ్లకు సాటి మరెవరూ ఉండరు. చేపల పులుసు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మన నెల్లూరోళ్ల చేపల పులుసు. చేపల పులుసు పెట్టాలి అంటే మన నెల్లూరోళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. వాళ్ళు వండే చేపల పులుసు ఘుమ ఘుమలతో వీధి మొత్తం నోట్లో నీళ్లు ఊరడం ఖాయం.
నెల్లూరు జిల్లా వాసులకు చేపలకు విడదీయరాని బంధం ఉంది. కొర్రమీను దగ్గర నుంచి సొరచేప, పండుగప్ప, బొమ్మిడాయి గండి, బొచ్చ, చందమామ, నెత్తాళ్ళు ఇలా ఎన్నో రకాల చేపలు నెల్లూరులో దొరుకుతాయి. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులైతే నెల్లూరులో దొరికే బొమ్మిడాయిల పులుసు కోసం ఎగబడతారు. నెల్లూరులో పెట్టే చేపల పులుసు విధానం మనం కూడా తెలుసుకోవాలి కదా. నెల్లూరోళ్ల మాదిరిగా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ముందుగా బొమ్మిడాయిలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత గిన్నెలో గళ్ళు ఉప్పు వేసుకుని చేపలు వేసి జిగురు పోయేవరకూ రుద్దకోవాలి. ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సిలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సిలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని దళసరి గిన్నె పెట్టుకొని అవసరమైన మేరకు నూనె వేసుకోవాలి.
నూనె వేడెక్కిన తర్వాత మిర్చి, ఉల్లిపాయల పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత ఆ మిశ్రమంలో కారం వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత బొమ్మిడాయిల చేపలను అందులో వేసుకుని బాగా వేయించాలి. అలాగే చింతపండు గుజ్జులో నీరు పోసుకుని కలిపి దానిని పులుసులో పోయాలి. కరివేపాకు, కొత్తమీర వేసుకుని పులుసు దగ్గరపడే వరకూ మరిగించాలి. కాసేపటికి రుచికరమైన బొమ్మిడాయిలు పులుసు రెడీ. రాగిసంకటిలో బొమ్మిడాయిల పులుసు వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఇలా ఎవరైనా సరే నెల్లూరు చేపల పులుసు పెట్టవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…