Navagraha Doshalu : మనలో ప్రతి ఒక్కరు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఉద్యోగాలు రాకపోవడం లేదా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, సంతానం లేకపోవడం, ఎంత సంపాదించినా ఖర్చు తప్ప ఆదాయం లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే కొందరు వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తమ సమస్యల నుండి బయటపడలేరు. అలాంటి వారంతా నవగ్రహ దోషాలతో బాధపడతున్నట్టేనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
నవగ్రహ దోష నివారణ అనేది చాలామందికి ఖర్చుతో కూడుకున్న పని. నవగ్రహ జపాలు,శాంతి, హోమాలు, దానాలు చేయటం సాధ్యం కాదు. మరి ఎలా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది లక్షలాదిమంది ఉన్న అనుమానం. అయితే పలు పురాణాల్లో, శాస్ర్తాల్లో, అనుభవజ్ఞుల జీవితంలో ఆచరించిన పలు చిన్నచిన్న క్రియలు అనేవి ఆచరిస్తే చాలు నవగ్రహదోషాలను తొలగిస్తాయి. ఆ క్రమంలో భాగంగా.. ఈ రోజు నవగ్రహ దోషం పోవాలంటే అత్యంత సులభమైన ఉపాయం మరియు ఆచరణ సాధ్యమైయ్యే ఒక విధానాన్ని నేడు తెలుసుకుందాం.
జన్మించిన సమయాన్ని బట్టి మన జాతకంలో ఆయా గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి మంచి, చెడు ఫలితాలు నిర్ణయించబడతాయి. ఎటువంటి దోషాలకైనా పలు శాస్ర్తాల్లో చెప్పిన విధంగా సులభమైన పరిష్కారాలు కచ్చితంగా ఉంటాయి. గోవు అంటే దేశవాలి ఆవు ద్వారా మన నవగ్రహదోషాలను తొలిగించుకోవచ్చు. గోవులోని అంగాలలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. సప్తఋషులు, నదులు, తీర్థములు గోవులో ఉంటాయి. గోపాదలో ధర్మార్థకామమోక్షములు ఉంటాయి. ఆవుకాళ్లను కడిగి ఆ నీటిని నెత్తిమీద చల్లుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి.
అంతేకాకుండా గోవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఆ సమయంలో ఎవరైతే గోధూళిలో నిలబడతారో వారికి నవగ్రహదోషాలు తొలిగిపోతాయి. భక్తితో ఇష్టదేవతా నామస్మరణతో గోధూళిలో నిలబడాలి. ఇలాకొన్ని రోజులుపాటు చేస్తే తప్పకుండా నవగ్రహదోషాలు పోతాయి. అదేవిధంగా గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే సకల శుభాలు కలుగుతాయి. గోపూజకు భక్తి అనేది ప్రధానం. అంతేకానీ మడి ప్రధానం కాదు. సూక్ష్మంలో మోక్షం పొందాలంటే గోపూజ, గోదానం, గోసేవ చేసుకోండి. తప్పక విశేష ఫలితాలు కలుగుతాయి. గోధూళివేళ స్వదేశీ గోవులు ఉన్నచోట నిలబడండి. వీలైతే గోవులు నడిచిపోయిన వెంటనే ఆ మట్టిని కొంత సేకరించి మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పొడి భస్మంగా నుదిటిన కొంచెం పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీ నవగ్రహదోషాలన్ని తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…