Nagarjuna : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంతకు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. సమంత చెప్పినా వినడం లేదని, బోల్డ్ సీన్లలో నటించేందుకే ప్రాధాన్యతను ఇస్తుందని, అసలు ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, అందువల్ల అబార్షన్ కూడా చేయించుకుందని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వాటన్నింటిపై సమంత కోర్టు వరకు వెళ్లింది.
కోర్టు అలాంటి వార్తలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానల్స్కు మొట్టికాయలు వేసింది. దీంతో క్షమాపణలతో సరిపెట్టారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే తాజాగా నాగార్జున కూడా సమంత బాటలో నడవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది.
ఇటీవల తాను ఎక్కడా మాట్లాడకున్నా.. చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లు, చానల్స్లో తన మాటలుగా కొన్ని వార్తలను ప్రచురించారు. సమంతనే ముందుగా విడాకులు కావాలని అడిగిందని, అందుకు చైతన్య ఒప్పుకున్నాడని.. నాగార్జున చెప్పాడని.. వార్తలు వచ్చాయి. అయితే ఆ మాటలను తాను అనలేదని నాగార్జున తరువాత క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ వార్తలపై నాగార్జున సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
అసలు ఈ వార్తలను మొదట ఎవరు సృష్టించారో తెలుసుకోవాలని నాగార్జున తన టెక్నికల్ టీమ్కు పురమాయించారట. ఈ వార్తలను ముందుగా ఎవరు సృష్టించారు, ఎవరు ప్రచురించారు.. అనే విషయాలను తెలుసుకుని వారిపై పరువు నష్టం దావా వేయనున్నారని తెలుస్తోంది. అప్పట్లో సమంత కూడా ఇలాగే చేసినందున.. నాగార్జున కూడా అదేవిధంగా ముందుకు సాగాలని చూస్తున్నారట.
అయితే తప్పుడు వార్తలు అనుకుంటే.. చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు ఆ వార్తలను ప్రచురించాయి కనుక అందరిపై పరువు నష్టం దావా వేయడం కుదరదు. అవి పుకారు వార్తల కిందకు వస్తాయి. కానీ కావాలని పనిగట్టుకుని ఎవరైనా సృష్టించి ఉంటే.. వారి గురించి తెలిస్తే.. అప్పుడు వారిపై లీగల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ వార్తలను క్రియేట్ చేసిన వారిని గుర్తిస్తారా.. లేదా.. అనేది చూడాలి.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…