Nagarjuna : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంతకు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. సమంత చెప్పినా వినడం లేదని, బోల్డ్ సీన్లలో నటించేందుకే ప్రాధాన్యతను ఇస్తుందని, అసలు ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, అందువల్ల అబార్షన్ కూడా చేయించుకుందని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వాటన్నింటిపై సమంత కోర్టు వరకు వెళ్లింది.
కోర్టు అలాంటి వార్తలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానల్స్కు మొట్టికాయలు వేసింది. దీంతో క్షమాపణలతో సరిపెట్టారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే తాజాగా నాగార్జున కూడా సమంత బాటలో నడవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది.
ఇటీవల తాను ఎక్కడా మాట్లాడకున్నా.. చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లు, చానల్స్లో తన మాటలుగా కొన్ని వార్తలను ప్రచురించారు. సమంతనే ముందుగా విడాకులు కావాలని అడిగిందని, అందుకు చైతన్య ఒప్పుకున్నాడని.. నాగార్జున చెప్పాడని.. వార్తలు వచ్చాయి. అయితే ఆ మాటలను తాను అనలేదని నాగార్జున తరువాత క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ వార్తలపై నాగార్జున సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
అసలు ఈ వార్తలను మొదట ఎవరు సృష్టించారో తెలుసుకోవాలని నాగార్జున తన టెక్నికల్ టీమ్కు పురమాయించారట. ఈ వార్తలను ముందుగా ఎవరు సృష్టించారు, ఎవరు ప్రచురించారు.. అనే విషయాలను తెలుసుకుని వారిపై పరువు నష్టం దావా వేయనున్నారని తెలుస్తోంది. అప్పట్లో సమంత కూడా ఇలాగే చేసినందున.. నాగార్జున కూడా అదేవిధంగా ముందుకు సాగాలని చూస్తున్నారట.
అయితే తప్పుడు వార్తలు అనుకుంటే.. చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు ఆ వార్తలను ప్రచురించాయి కనుక అందరిపై పరువు నష్టం దావా వేయడం కుదరదు. అవి పుకారు వార్తల కిందకు వస్తాయి. కానీ కావాలని పనిగట్టుకుని ఎవరైనా సృష్టించి ఉంటే.. వారి గురించి తెలిస్తే.. అప్పుడు వారిపై లీగల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ వార్తలను క్రియేట్ చేసిన వారిని గుర్తిస్తారా.. లేదా.. అనేది చూడాలి.
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…