Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఆయన తన తమ్ముడు పవన్ కల్యాణ్కు చెందిన జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. ఇక నాగబాబు మరోవైపు బుల్లితెరకు సైతం సమయం కేటాయిస్తున్నారు. ఈ మధ్యే తన కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు నాగబాబు మీడియా ముందుకు వచ్చారు. తరువాత పెద్దగా బయటకు రావడం లేదు. కానీ జనసేన కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు.
ఇక నాగబాబు రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు. తన తండ్రి గురించి బాధాతప్త హృదయంతో ఆయన ఆ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది. తన తండ్రికి ఆయన ఆ పోస్టు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఆయన బతికి ఉన్నప్పుడు చెప్పాలనుకున్న కొన్ని విషయాలను చెప్పలేకపోయానని.. అప్పుడు తనకు సెన్స్ ఉండేది కాదని.. కానీ ఆ విషయాలను చెప్పాలని అనుకున్నప్పుడు ఆయన లేరని.. దీంతో బాధగా ఉందని నాగబాబు అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్కు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఎవరైనా సరే తమ బాధలను, సంతోషాలను, సుఖాలను, దుఖాలను తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడే పంచుకోవాలని.. లేకపోతే తగిన సమయం లభించదని.. ఆ తరువాత తనలా బాధపడాల్సి వస్తుందని అన్నారు. ఇక నాగబాబు పెట్టిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా నాగబాబు ఈ మధ్యే తన తల్లి జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆయనకు తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టం, గౌరవం అని చెప్పవచ్చు. తన సోదరుడు పవన్ అంటే చాలా ప్రేమ. ఆయనపై ఒక మాట కూడా పడనివ్వరు. ఎవరైనా ఏదైనా పవన్ను అంటే వెంటనే నాగబాబు స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగబాబు జనసేనను ఎలాగైనా అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…