Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఆయన తన తమ్ముడు పవన్ కల్యాణ్కు చెందిన జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. ఇక నాగబాబు మరోవైపు బుల్లితెరకు సైతం సమయం కేటాయిస్తున్నారు. ఈ మధ్యే తన కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు నాగబాబు మీడియా ముందుకు వచ్చారు. తరువాత పెద్దగా బయటకు రావడం లేదు. కానీ జనసేన కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు.
ఇక నాగబాబు రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు. తన తండ్రి గురించి బాధాతప్త హృదయంతో ఆయన ఆ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది. తన తండ్రికి ఆయన ఆ పోస్టు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఆయన బతికి ఉన్నప్పుడు చెప్పాలనుకున్న కొన్ని విషయాలను చెప్పలేకపోయానని.. అప్పుడు తనకు సెన్స్ ఉండేది కాదని.. కానీ ఆ విషయాలను చెప్పాలని అనుకున్నప్పుడు ఆయన లేరని.. దీంతో బాధగా ఉందని నాగబాబు అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్కు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఎవరైనా సరే తమ బాధలను, సంతోషాలను, సుఖాలను, దుఖాలను తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడే పంచుకోవాలని.. లేకపోతే తగిన సమయం లభించదని.. ఆ తరువాత తనలా బాధపడాల్సి వస్తుందని అన్నారు. ఇక నాగబాబు పెట్టిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా నాగబాబు ఈ మధ్యే తన తల్లి జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆయనకు తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టం, గౌరవం అని చెప్పవచ్చు. తన సోదరుడు పవన్ అంటే చాలా ప్రేమ. ఆయనపై ఒక మాట కూడా పడనివ్వరు. ఎవరైనా ఏదైనా పవన్ను అంటే వెంటనే నాగబాబు స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగబాబు జనసేనను ఎలాగైనా అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…