Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఆయన తన తమ్ముడు పవన్ కల్యాణ్కు చెందిన జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. ఇక నాగబాబు మరోవైపు బుల్లితెరకు సైతం సమయం కేటాయిస్తున్నారు. ఈ మధ్యే తన కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు నాగబాబు మీడియా ముందుకు వచ్చారు. తరువాత పెద్దగా బయటకు రావడం లేదు. కానీ జనసేన కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు.
ఇక నాగబాబు రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు. తన తండ్రి గురించి బాధాతప్త హృదయంతో ఆయన ఆ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది. తన తండ్రికి ఆయన ఆ పోస్టు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఆయన బతికి ఉన్నప్పుడు చెప్పాలనుకున్న కొన్ని విషయాలను చెప్పలేకపోయానని.. అప్పుడు తనకు సెన్స్ ఉండేది కాదని.. కానీ ఆ విషయాలను చెప్పాలని అనుకున్నప్పుడు ఆయన లేరని.. దీంతో బాధగా ఉందని నాగబాబు అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్కు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఎవరైనా సరే తమ బాధలను, సంతోషాలను, సుఖాలను, దుఖాలను తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడే పంచుకోవాలని.. లేకపోతే తగిన సమయం లభించదని.. ఆ తరువాత తనలా బాధపడాల్సి వస్తుందని అన్నారు. ఇక నాగబాబు పెట్టిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా నాగబాబు ఈ మధ్యే తన తల్లి జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆయనకు తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టం, గౌరవం అని చెప్పవచ్చు. తన సోదరుడు పవన్ అంటే చాలా ప్రేమ. ఆయనపై ఒక మాట కూడా పడనివ్వరు. ఎవరైనా ఏదైనా పవన్ను అంటే వెంటనే నాగబాబు స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగబాబు జనసేనను ఎలాగైనా అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…