Naga Chaitanya : లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల విజయాల అనంతరం నాగచైతన్య మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం థాంక్ యూ అనే మూవీని కంప్లీట్ చేసిన చైతూ ఓ థ్రిల్లర్ సిరీస్లో నటిస్తున్నాడు. అలాగే త్వరలో పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. తరువాత డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో ఇంకో మూవీ చేయనున్నాడు. అయితే చైతూ మొదటి సారిగా హిందీలో నటించిన లాల్ సింగ్ చడ్డా అనే మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో అమీర్ఖాన్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. కరీనా కపూర్ ఆయనకు జోడీగా యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు చెందిన ట్రైలర్ను కూడా ఇటీవలే విడుదల చేశారు.
అయితే ఈ ట్రైలర్ను చూసిన అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ ట్రైలర్లో చైతూ చాలా తక్కువ సమయం పాటు కనిపించాడు. ఇది అక్కినేని ఫ్యాన్స్కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అయితే దీనిపై కొందరి వాదన ఎలా ఉందంటే.. సమంత బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్ 2 అనే సిరీస్ చేసింది కదా. ఆమె నటించిన కారణంగా ఆ సిరీస్ ఇంకా హిట్ అయింది. దీంతో బాలీవుడ్లో సమంత మంచి పేరు తెచ్చుకుంది. కానీ చైతూ మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. అందుకు లాల్ సింగ్ చడ్డా ట్రైలర్ను వారు కారణంగా చూపిస్తున్నారు. అందులో చైతూ అసలు ఎక్కువ సమయం పాటు కనిపించలేదు. అందుకనే సమంతలా బాలీవుడ్లో చైతూ రాణించలేకపోయాడు.. అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక నాగచైతన్య పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ట్రైలర్లో ఎక్కువ సమయం పాటు చూపించలేదు. కానీ సినిమాలో మాత్రం ఆయన పాత్ర నిడివి సుమారుగా 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఉత్తరాది ప్రేక్షకులు చైతూను గుర్తుంచుకుంటారా.. అన్నది సందేహంగా మారింది. పూర్తి స్థాయి నిడివి కలిగిన పాన్ ఇండియా మూవీలో నటిస్తే గుర్తింపు వస్తుంది. కానీ చైతూ ఇప్పుడు చేసిన సినిమాలో ఆయన పాత్ర చాలా తక్కువ సేపు ఉంటుంది. కనుక చైతూను పాన్ ఇండియా స్టార్గా గుర్తిస్తారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే సినిమా విడుదలయ్యాక ఈ విషయంపై స్పష్టత రానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…