Pranitha : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే దగ్గినా.. తుమ్మినా.. అందులో అప్డేట్స్ను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఫాలోవర్లకు మంచి ఇన్ఫర్మేషన్ లేదా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే పోస్టులు అయితే ఫర్వాలేదు.. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం అడ్డమైన ఫొటోలన్నీ షేర్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లకు సైతం చిర్రెత్తుకొస్తోంది. అలాంటి పరిస్థితిలో వారు ఊరుకుంటారా.. సెలబ్రిటీలపై ట్రోలింగ్ మొదలుపెడతారు. భారీగా విమర్శలు చేస్తారు. ఇప్పుడిది కూడా ట్రెండ్ అయింది. ఇక తాజాగా ప్రణీత కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
నటి ప్రణీత గర్భంతో ఉన్న విషయం తెలిసిందే కదా. మొన్నీ మధ్యే ఈమె తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. అంతకు ముందు తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు స్కానింగ్ రిపోర్ట్తో భర్త మీదకు ఎక్కేసింది. దీంతో అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈమె సినిమా అవకాశాలు లేకపోవడంతో కోవిడ్ సమయంలో చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకుంది. వెంటనే తన వివాహ విషయం షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. అయితే ఇప్పుడు ఈమెను సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
ప్రణీత లేటెస్ట్గా బాత్ టబ్లో స్నానం చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె బేబీ బంప్తో కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గర్భంతో ఉన్న సమయంలో ఇలాంటి ఫొటోలు దిగేందుకు సిగ్గులేదా.. గర్భంతో ఉన్నావన్న సంగతి మరిచిపోయావా.. బిడ్డ జాగ్రత్త.. ఇలాంటి ఫొటోలు ప్రైవేట్గా దాచిపెట్టుకో.. పబ్లిగ్గా షేర్ చేయకు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రణీత ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…