Most Eligible Bachelor : అఖిల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, దర్శకులు సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో బన్నీ, ఆయన తండ్రి అల్లు అరవింద్ పూజా హెగ్డేపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బన్నీ.. పూజా గురించి చెబుతూ.. నా ఒక్కడికే తను స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు. అందరికీ స్పెషలే. తను ఏ హీరోతో నటిస్తే వారు హిట్ అందుకున్నట్టే అని అన్నారు. ఇక అల్లు అరవింద్ తగ్గేదేలే అంటూ వేదికపై స్పీచ్ స్టార్ట్ చేశారు.
పూజా గురించి మాట్లాడిన అరవింద్ .. మా డార్లింగ్ పూజా అనేశాడు. ఈ సినిమాలో చించేసింది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె కెరీర్లో ఇదో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని గర్వంగా చెబుతున్నా అన్నారు. నీ కెరీర్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. అన్నారు అరవింద్. భాస్కర్తో సినిమా తీసేటప్పుడు ఒళ్లునొప్పులు ఉంటాయి కానీ తర్వాత అవి తీపులుగా మారిపోతాయని అన్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…