Mokshagna : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అఫిషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. ఇప్పటికే అక్కినేని, మెగా, అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల నుంచి నట వారసులు వచ్చి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఆ జనరేషన్ వారిలో బాలయ్య ఒక్కడే ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు.
అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తున్నాడు బాలయ్య. అయితే ఆదిత్య 369 సీక్వెల్ ను మోక్షజ్ఞతో తెరకెక్కిస్తానని.. కుదిరితే దానికి నేనే దర్శకత్వం వహిస్తానని ఇటీవల బాలయ్య అన్నాడు. కానీ తర్వాత ఎప్పటిలాగే క్రిష్, బోయపాటి, కొరటాల, రాజమౌళి పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం మోక్షజ్ఞలో హీరోకి ఉండాల్సిన లుక్ కనిపించడం లేదు. ఆ మధ్యన బర్త్ డే వేడుకల సందర్భంగా మోక్షజ్ఞ పిక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని టర్కీ షెడ్యూల్ పూర్తయింది.
ఈ సందర్భంగా మోక్షజ్ఞ పిక్ మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫ్యామిలీ, బాలకృష్ణ, వసుంధర, మోక్షజ్ఞ ఉన్నారు. మోక్షజ్ఞ వైట్ షర్ట్ ధరించి కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ బాడీలో ఇంకా ఫిట్ నెస్ కనిపించకపోవడంతో నందమూరి అభిమానులు తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు. అయితే బాలయ్య 107వ చిత్రం షూటింగ్స్ లో మోక్షజ్ఞ ఇన్వాల్వ్ అవుతుండడం, సెట్స్ కి వెళుతుండడం కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇలా దగ్గరుండి బాలయ్య నటనలో మెళుకువలు నేర్పుతున్నాడేమో. దీనిపై త్వరలో బాలయ్య అధికారిక ప్రకటన చేస్తే కానీ అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేలా లేదు. బాలకృష్ణ.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…