Mega Fans vs Mahesh Fans : మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం.. ఆచార్య. ఈ మూవీ ఏప్రిల్ 29వ తేదీన భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయింది. మొత్తంగా చూస్తే రూ.84 కోట్ల మేర నిర్మాతలకు ఈ మూవీ నష్టాలను తెచ్చి పెట్టిందని అధికారిక లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతోంది. అయితే ఆచార్య ఫ్లాప్ కావడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కారణాలు ఏమున్నప్పటికీ ఆచార్య మూవీ ఫ్యాన్స్ను నిరాశ పరిచింది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే సినిమా బంపర్ హిట్ అయిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కూడా చేసుకున్నారు. ఇక తొలి రోజు ఈ మూవీ ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ను వరల్డ్ వైడ్గా సాధించిందని.. ఇది ఒక తెలుగు సినిమాకు ఒక రోజుకు లభించిన అధిక మొత్తాల్లో ఒకటని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే దీనిపై మెగాఫ్యాన్స్ మండిపడుతున్నారు. మహేష్ బాబు ఫేక్ కలెక్షన్స్ చూపెడుతున్నారని ఆరోపిస్తూ.. వారు సోషల్ మీడియాలో #SVPFakeCollections అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు.
అయితే ఇందుకు ప్రతిగా మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. వారు ఏకంగా #MegaFamilyRankuMogudu అని చెప్పి ఇంకో హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో మెగా ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీ హీరో వేస్ట్.. అంటే.. మీ హీరోనే వేస్ట్.. అని ఫ్యాన్స్ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఆచార్యకు మహేష్ వాయిస్ ఓవర్ అందించారు. అయినప్పటికీ ఆయనను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకనే తాము మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశామని.. అలాగే తప్పుడు కలెక్షన్లని చెబుతూ ఆరోపణలు చేస్తున్నారని.. కనుకనే తాము మెగాఫ్యామిలీకి చెందిన హ్యాష్ ట్యాగ్ పేరిట ట్వీట్స్ను ట్రెండ్ చేస్తున్నామని.. మహేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ గొడవ ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…