Puri Jagannadh : మహేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇందులో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. సముద్రఖని విలన్ పాత్రలో కనిపించారు. రివ్యూలతోపాటు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నందున ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఇక వీకెండ్లో ఇంకా ఎక్కువ కలెక్షన్లను రాబడుతుందని ఆశిస్తున్నారు. అయితే ఈ మూవీ దర్శకుడు పరశురామ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్, మహేష్ బాబులకు మధ్య గ్యాప్ వచ్చిందా.. అని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
గతంలో మహేష్, పూరీ కాంబినేషన్లో తెరకెక్కిన పోకిరి, బిజినెస్మ్యాన్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. పోకిరి సినిమా అయితే మహేష్ కెరీర్ లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అందులో మహేష్కు జోడీగా మొదట్లో అయేషా టకియాను తీసుకోవాలని పూరీ అనుకున్నారు. కానీ ఆ అవకాశం ఇలియానాను వరించింది. దీంతో ఆ మూవీతో ఇలియానా దశ తిరిగి పోయింది. అనేక సినిమాల్లో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే మహేష్, పూరీ కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు. దీంతో వారి మధ్య ఏదో జరిగిందని.. అందుకనే చాలా గ్యాప్ వచ్చిందని.. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై పరశురామ్ క్లారిటీ ఇచ్చారు.
మహేష్, పూరీ జగన్నాథ్ల మధ్య గ్యాప్ వచ్చిందని మీరు భావిస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు పరశురామ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు. మహేష్ దర్శకులను మారుస్తూ సినిమాలు చేస్తున్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. అందువల్ల పూరీతో సినిమా మళ్లీ చేయలేకపోతున్నారు. లేదంటే మహేష్, పూరీ కాంబినేషన్లో మరిన్ని చిత్రాలు వచ్చేవి. అయినా సరైన కథ దొరకాలే కానీ.. ఆ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందని.. ఆశిస్తున్నానని తెలిపారు.
ఇక పరశురామ్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పేశారు. తాను వాస్తవానికి మహేష్ మహర్షి మూవీ సమయంలోనే ఆయనకు సర్కారు వారి పాట కథ చెప్పానని.. దీంతో ఓకే చేశారని.. అయితే సరిలేరు నీకెవ్వరు వెంటనే చేయాల్సి వచ్చిందని.. కనుక ఆ మూవీ తరువాత సర్కారు వారి పాట చేశామని తెలిపారు. అయితే మహేష్ తో ఈ మూవీ ఆలస్యం అవుతుంది కనుక ముందుగా చైతూతో 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సినిమా చేద్దామని చైతన్యను సంప్రదించానని ఆయన ఓకే చెప్పారని తెలిపారు.
అయితే సడెన్గా మహేష్ సర్కారు వారి పాట చేద్దామని అన్నారని.. దీంతో చైతన్యను తరువాత సినిమా చేద్దామని రిక్వెస్ట్ చేశానని.. మహేష్తో మళ్లీ అవకాశం రాదేమోనని.. కనుక మీ సినిమా నేను తరువాత చేస్తానని చైతూకు చెప్పానని.. దీంతో చైతూ సానుకూలంగా స్పందించారని.. ఆయన ఓకే చెప్పాకే సర్కారు వారి పాటకు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.. అలా ఈ మూవీని తెరకెక్కించామని పరశురామ్ తెలిపారు. ఈ క్రమంలోనే మహేష్, పూరీల మధ్య ఉన్న విషయాలపై పరశురామ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…