Namrata Shirodkar : ఈ మధ్య స్టార్ హీరోల బర్త్ డే ల సందర్భంగా వారి పాత హిట్ సినిమాలను స్పెషల్ షోల రూపంలో థియేటర్లలో ప్రదర్శించడం ఆనవాయితీగా మారిపోయింది. కొద్ది రోజుల క్రితం ఇలాగే మహేష్ బాబు పోకిరి సినిమా స్పెషల్ షోలు వేయడం జరిగింది. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం కూడా ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జల్సా సినిమా 4కె లో విడుదల కానుంది. థియేటర్ల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే ఉంది. సదరు షోలకు టికెట్ల బుకింగులు కూడా మొదలవడంతోపాటు పలుచోట్ల అడ్వాన్సు బుకింగ్ లు స్పీడందుకున్నాయి. మెగా అభిమానుల సంబరాలు కూడా అప్పుడే మొదలైపోయాయి.
మరోవైపు కొందరు మెగా అభిమానులు జల్సా మూవీ స్పెషల్ షోల విషయంలో మహేష్ బాబు ఇంకా నమ్రతలపై ఆరోపణలు చేస్తున్నారు. జల్సా సినిమా పోకిరి రికార్డులను బ్రేక్ చేస్తుందని అందుకే వారికి మహేష్ బాబు కి చెందిన ఏఎంబీ సినిమాస్ లో జల్సా స్పెషల్ షోలను వేయడం ఇష్టం లేదని అందువల్ల వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. ఇక ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ పై నమ్రత ఆధిపత్యం ఉంది కనుక తనే ఇదంతా చేస్తుందని ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
అయితే ఈ ఆరోపణ అర్థం లేనిదనీ, జల్సా చిత్రం ఏఎంబీ సినిమాస్ లో విడుదల అవుతుందని, బుకింగ్స్ కూడా మొదలయ్యాయని కొందరు చెబుతున్నారు. ఏఎంబీ వారు ఆదాయంలో ఎక్కువ భాగం నిర్మాతలనుండి డిమాండ్ చేస్తారని, దీని కోసం జరిగే చర్చల వలన జల్సా ప్రదర్శన నిర్ణయం కొద్దిగా ఆలస్యం అయ్యిందని, ఇంతలో కొందరు హడావిడి చేశారని సిని వర్గాల సమాచారంగా తెలుస్తోంది. అయితే కొసమెరుపు ఏంటంటే ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ లో మహేష్ బాబు వాటా చాలా తక్కువ కాగా ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ది మెజారిటీ వాటాగా ఉంది. కానీ కొందరు కావాలనే మహేష్, నమ్రతలను టార్గెట్ చేశారని అభిప్రాయ పడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…