Mayanti Langer : క్రికెట్ మ్యాచ్ల సందర్బంగా యాంకరింగ్ చేసే ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్.. మయంతి లాంగర్ గుర్తుంది కదా. అవును.. ఆమే.. ఆమె చాలా కాలం నుంచి యాంకర్గా పనిచేయడం లేదు. క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడల్లా ఆమె యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తుంటుంది. స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసినప్పటి నుంచి చాలా సీజన్లలో మయంతి లాంగర్ యాంకర్గా పనిచేసింది. అయితే ఉన్నట్లుండి ఆమె సడెన్గా మాయమైంది. క్రికెట్ టోర్నమెంట్లలో యాంకర్గా వేరే వాళ్లు వస్తున్నారు. ఐపీఎల్లోనూ వేరే యాంకర్లు కనిపిస్తున్నారు. కానీ మయంతి లాంగర్ మాత్రం కనిపించడం లేదు. అయితే ఆమె యాంకరింగ్ చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి ? అన్న విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి మయంతి లాంగర్ మనకు కనిపించడం లేదు. ఆమె క్రికెట్ ప్లేయర్ స్టువర్ట్ బిన్నీని వివాహం చేసుకున్న విషయం విదితమే. అయితే ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో ఆమె గర్భవతి అయి ప్రసవించింది. అందుకనే ఆ సీజన్కు ఆమె యాంకర్గా రాలేదు. తాను ఐపీఎల్ను చాలా మిస్ అవుతున్నానని.. ప్రస్తుతం తనకు సంతానం కలిగినందున తాను ఐపీఎల్లో యాంకర్గా రాలేనని.. అవకాశం ఉంటే మళ్లీ వస్తానని.. ఆమె స్వయంగా అప్పట్లో తెలియజేసింది. అయితే ఈ వార్త అంతగా ప్రచారం కాలేదు, కనుక మయంతికి ఏమైంది ? అనే విషయం చాలా మందికి తెలియలేదు.
అయితే ప్రసవించిన తరువాత కూడా మయంతి లాంగర్ అనేక విధాలుగా మారిపోయింది. అంతకు ముందు ముద్దుగా బొద్దుగా ఉండే ఈమె తరువాత గుర్తు పట్టరాకుండా మారింది. పూర్తిగా బలహీనంగా కనిపించింది. సహజంగానే ప్రసవానంతరం మహిళలు చాలా మంది మారిపోతారు. కొందరు సన్నగా అయితే కొందరు విపరీతంగా లావు పెరుగుతారు. మయంతి కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. మరో వైపు భర్త స్టువర్ట్ బిన్నీ కూడా ఐపీఎల్లో ఏ ఒక్క జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో అన్ని విధాలుగా ఆ ప్రపంచానికి దూరంగా ఉండడమే మంచిదని మయంతి లాంగర్ భావించింది. కనుకనే ఆమె యాంకర్గా మనకు కనిపించడం లేదు.
అయితే ఈమె మళ్లీ తన యథా రూపాన్ని పొందితే అప్పుడు ఈమెను మళ్లీ మనం క్రికెట్ మ్యాచ్లలో చూసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆమె మళ్లీ వచ్చి యాంకరింగ్ చేస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…