Mayanti Langer : క్రికెట్ మ్యాచ్ల సందర్బంగా యాంకరింగ్ చేసే ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్.. మయంతి లాంగర్ గుర్తుంది కదా. అవును.. ఆమే.. ఆమె చాలా కాలం నుంచి యాంకర్గా పనిచేయడం లేదు. క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడల్లా ఆమె యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తుంటుంది. స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసినప్పటి నుంచి చాలా సీజన్లలో మయంతి లాంగర్ యాంకర్గా పనిచేసింది. అయితే ఉన్నట్లుండి ఆమె సడెన్గా మాయమైంది. క్రికెట్ టోర్నమెంట్లలో యాంకర్గా వేరే వాళ్లు వస్తున్నారు. ఐపీఎల్లోనూ వేరే యాంకర్లు కనిపిస్తున్నారు. కానీ మయంతి లాంగర్ మాత్రం కనిపించడం లేదు. అయితే ఆమె యాంకరింగ్ చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి ? అన్న విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి మయంతి లాంగర్ మనకు కనిపించడం లేదు. ఆమె క్రికెట్ ప్లేయర్ స్టువర్ట్ బిన్నీని వివాహం చేసుకున్న విషయం విదితమే. అయితే ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో ఆమె గర్భవతి అయి ప్రసవించింది. అందుకనే ఆ సీజన్కు ఆమె యాంకర్గా రాలేదు. తాను ఐపీఎల్ను చాలా మిస్ అవుతున్నానని.. ప్రస్తుతం తనకు సంతానం కలిగినందున తాను ఐపీఎల్లో యాంకర్గా రాలేనని.. అవకాశం ఉంటే మళ్లీ వస్తానని.. ఆమె స్వయంగా అప్పట్లో తెలియజేసింది. అయితే ఈ వార్త అంతగా ప్రచారం కాలేదు, కనుక మయంతికి ఏమైంది ? అనే విషయం చాలా మందికి తెలియలేదు.
అయితే ప్రసవించిన తరువాత కూడా మయంతి లాంగర్ అనేక విధాలుగా మారిపోయింది. అంతకు ముందు ముద్దుగా బొద్దుగా ఉండే ఈమె తరువాత గుర్తు పట్టరాకుండా మారింది. పూర్తిగా బలహీనంగా కనిపించింది. సహజంగానే ప్రసవానంతరం మహిళలు చాలా మంది మారిపోతారు. కొందరు సన్నగా అయితే కొందరు విపరీతంగా లావు పెరుగుతారు. మయంతి కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. మరో వైపు భర్త స్టువర్ట్ బిన్నీ కూడా ఐపీఎల్లో ఏ ఒక్క జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో అన్ని విధాలుగా ఆ ప్రపంచానికి దూరంగా ఉండడమే మంచిదని మయంతి లాంగర్ భావించింది. కనుకనే ఆమె యాంకర్గా మనకు కనిపించడం లేదు.
అయితే ఈమె మళ్లీ తన యథా రూపాన్ని పొందితే అప్పుడు ఈమెను మళ్లీ మనం క్రికెట్ మ్యాచ్లలో చూసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆమె మళ్లీ వచ్చి యాంకరింగ్ చేస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…