Manchu Vishnu Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలను ప్రకటించినప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకు ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక.. వివాదాలు తగ్గుతాయనుకుంటే.. ఇంకా పెరిగాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు అటు నరేష్, ఇటు ప్రకాష్ రాజ్లు దూషణల పర్వం మొదలు పెట్టారు. దీంతో చిలికి చిలికి ఈ వివాదం గాలి వానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
అయితే గురువారం ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మా ఎన్నికల్లో తమ కుమారుడు మంచు విష్ణుకు మద్దతు తెలిపినందుకు గాను ధన్యవాదాలు చెబుతూ బాలకృష్ణను మోహన్బాబు కలిశారు. అయితే అదే సమయంలో.. అటు వైపు.. మంచు మనోజ్ పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ భీమ్లా నాయక్ షూటింగ్లో ఉన్నారు. దీంతో ఆయనను షూటింగ్ లొకేషన్లోనే మనోజ్ కలిశారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ? అనేది సస్పెన్స్గానే ఉంది. కానీ బుజ్జగింపులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం వస్తోంది.
ఎన్నికల రోజు మనోజ్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన పవన్తో కాసేపు సరదాగా గడిపారు. వారి మధ్య సాన్నిహిత్యం బాగానే ఉంది. దీంతో పవన్కు చెప్పి వివాదం లేకుండా సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించేందుకు మంచు ప్యానెల్ మనోజ్ను పంపించిందని అనుకోవచ్చు. పవన్ నచ్చజెబితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నాగబాబు ఇప్పటికే దురుసుగా మాట్లాడి మరింత దూరం పెంచారు. కానీ పవన్ మాట్లాడితే ప్రకాష్ రాజ్ వింటారు కనుక.. అటు నుంచి నరుక్కు రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పవన్ను మనోజ్ సరదాగా కలిస్తే ఓకే. కానీ మా వివాదాన్ని సద్దుమణిగించేందుకు కలసి ఉంటే మాత్రం రానున్న రోజుల్లో వివాదాలకు బదులుగా ఆత్మీయ పలకరింపులను మనం చూడవచ్చు. మరి మా లో నెలకొన్న వివాదాలు మరికొద్ది రోజుల్లో సమసిపోతాయా ? లేదా ? అన్నది చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…