మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జిన్నా. పూర్తి యాక్షన్, కమర్షియల్, ఎంటర్టైనింగ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. చాలాకాలంగా సరైన హిట్ లేని మంచు విష్ణుకు ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు జిన్నా సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. హీరోయిన్స్ తో ఉన్న సరికొత్త రొమాంటిక్ పోస్టర్ ను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా నిజానికి అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కావాల్సి ఉంది.
కానీ, గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలు ఉండటంతో జిన్నా సినిమాని వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా జిన్నా సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి జారు మిఠాయా అనే సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ యూట్యూబ్లో తెగ వైరల్ అవుతోంది. మంచు విష్ణు- సన్నీ లియోన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అంతేకాకుండా డాన్స్ పరంగానూ విష్ణు చాలా మెరుగైనట్లు కితాబిస్తున్నారు. ఏకంగా మంచు విష్ణు డాన్స్ మూమెంట్స్ వీడియో కట్ చేసి స్టార్ అల్లు అర్జున్ సాంగ్తో కంపేర్ చేసి వీడియో వైరల్ చేస్తున్నారు.
డాన్స్లో మంచు విష్ణు ఎంతో ఇంప్రూవ్ అయ్యాడని చెప్పేందుకు ఈ క్లిప్ చాలంటూ కామెంట్ చేస్తున్నారు. బద్రీనాథ్ సినిమాలోని నాథ్ నాథ్ నీలో బద్రీనాథ్ సాంగ్లో ఒక మ్యూజిక్ బిట్ ఉంటుంది. దానికి బన్నీ ఆగకుండా తన మూవ్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు సేమ్ అలాంటి మూమెంట్స్ తో మంచు విష్ణు కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు. అల్లు అర్జున్- మంచు విష్ణులను పక్క పక్కన పెట్టి ఆ ట్రాక్, జారు మిఠాయా ట్రాక్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా యూట్యూబ్లో వైరల్ అవుతోంది. మరి.. ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…