Diamond : అదృష్టం అనేది జీవితంలో ఎవరినైనా ఒక్కసారి మాత్రమే వరిస్తుంది. అది వరించినప్పుడు రాత్రికి రాత్రే కొందరు కోటీశ్వరులు అవుతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాగే జరిగింది. ఎన్నో ఏళ్లుగా వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభించింది. అత్యంత ఖరీదైన వజ్రం వారికి లభించింది. దీంతో వారు కోటీశ్వరులు అయ్యారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఉన్న సుశీల్ శుక్లా కుటుంబం గత కొన్నేళ్ల నుంచి ఇటుకల బట్టీని నడుపుతోంది. ఈ బట్టీ కోసం మట్టిని కృష్ణ కళ్యాణ్పూర్ ఏరియా నుంచి తెస్తుంటారు. అయితే తాజాగా సుశీల్ కుటుంబం అలా సేకరించిన మట్టిని ప్రాసెస్ చేస్తుండగా.. అందులోంచి ఒక వజ్రం బయట పడింది. దాని ఖరీదు రూ.1.20 కోట్లని తేలింది. అది 26.11 క్యారెట్ల వజ్రం. దీంతో సుశీల్ కుటుంబం రాత్రికి రాత్రే ధనిక కుటుంబంగా మారింది. అలా సుశీల్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
అయితే సదరు ప్రాంతం వజ్రాలకు నిలయం. గతంలో ఎంతో మంది ఆ ప్రాంతంలో వజ్రాలను సాధించారు. అనేక చోట్ల వజ్రాలు కొందరికి లభించాయి. అందువల్ల గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా సుశీల్కు ఓ వజ్రం లభించింది. దీంతో దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఏదైనా బిజినెస్ చేసుకుంటానని చెబుతున్నాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…