Diamond : అదృష్టం అనేది జీవితంలో ఎవరినైనా ఒక్కసారి మాత్రమే వరిస్తుంది. అది వరించినప్పుడు రాత్రికి రాత్రే కొందరు కోటీశ్వరులు అవుతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాగే జరిగింది. ఎన్నో ఏళ్లుగా వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభించింది. అత్యంత ఖరీదైన వజ్రం వారికి లభించింది. దీంతో వారు కోటీశ్వరులు అయ్యారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఉన్న సుశీల్ శుక్లా కుటుంబం గత కొన్నేళ్ల నుంచి ఇటుకల బట్టీని నడుపుతోంది. ఈ బట్టీ కోసం మట్టిని కృష్ణ కళ్యాణ్పూర్ ఏరియా నుంచి తెస్తుంటారు. అయితే తాజాగా సుశీల్ కుటుంబం అలా సేకరించిన మట్టిని ప్రాసెస్ చేస్తుండగా.. అందులోంచి ఒక వజ్రం బయట పడింది. దాని ఖరీదు రూ.1.20 కోట్లని తేలింది. అది 26.11 క్యారెట్ల వజ్రం. దీంతో సుశీల్ కుటుంబం రాత్రికి రాత్రే ధనిక కుటుంబంగా మారింది. అలా సుశీల్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
అయితే సదరు ప్రాంతం వజ్రాలకు నిలయం. గతంలో ఎంతో మంది ఆ ప్రాంతంలో వజ్రాలను సాధించారు. అనేక చోట్ల వజ్రాలు కొందరికి లభించాయి. అందువల్ల గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా సుశీల్కు ఓ వజ్రం లభించింది. దీంతో దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఏదైనా బిజినెస్ చేసుకుంటానని చెబుతున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…