Love Story : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీలో నాగచైతన్య, సాయిపల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ మూవీకి గాను చిత్ర బృందం సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగచైతన్య, సాయిపల్లవిలు ఈ మూవీ గురించి తమ అనుభవాలను పంచుకున్నారు.
లవ్ స్టోరీ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్లో నాగ చైతన్య మాట్లాడుతూ.. తాను శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకున్నానని అన్నారు. అయితే ప్రస్తుతం సినిమా విడుదల అయింది కనుక ఇక ఆయనతో ప్రయాణం చేయలేనని, అందుకు బాధగా ఉందని అన్నారు. అయినప్పటికీ మళ్లీ కలసి పనిచేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.
ఇక తన సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తాను స్వయంగా తెలుసుకుంటానని, తన సినిమాపై విమర్శకులు ఏమంటున్నారోనని తెలుసుకుంటానని తెలిపాడు. కరోనా వల్ల ఇలాంటి విషయాలు తెలుసుకోలేకపోయానని, అయినప్పటికీ ఇప్పుడు ఆ అవకాశం లభించిందన్నారు. లవ్ స్టోరీ విడుదల కావడంతో ఎంతో ఆనంద పడ్డానని తెలిపారు. థియేటర్కు వచ్చి సినిమా చూసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని, సినిమా విడుదలతో తమ ఇద్దరి ప్రయాణం ఆగిపోతుందని బాధ కలుగుతుందని అన్నారు.
అనంతరం సాయిపల్లవి మాట్లాడుతూ.. చిత్ర బృందం సమిష్టిగా కృషి చేయడం వల్లే మూవీ అద్భుతంగా వచ్చి హిట్ అయిందన్నారు. అందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మూవీ విడుదలపై ఆందోళన చెందానని, ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఖంగారు పడ్డానని అన్నారు. అయితే సినిమా హిట్ కావడంతో సంతోషంగా ఉందన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…