Left Over Foods : సాధారణంగా ఫ్రిజ్లు ఉన్న ఎవరైనా సరే తినగా మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిజ్ లో పెడుతుంటారు. వాటిని మళ్లీ ఇంకో పూట బయటకు తీసి వేడి చేసి తింటారు. అయితే అప్పటికీ ఆ ఆహారం అయిపోకపోతే మళ్లీ దాన్ని ఫ్రిజ్ లో పెడతారు. ఈ విధంగా చాలా మంది చేస్తుంటారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
తినగా మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిజ్లో పెడుతున్న వారు కచ్చితంగా కింద తెలిపిన విషయాలను తెలుసుకోవాలి. అవేమిటంటే..
ఆహార పదార్థాలను వండిన తరువాత 90 నిమిషాల్లో తినేయాలి. ఆలోగా వాటిని తిని పూర్తి చేస్తే ఓకే. లేదా ఏమైనా ఆహారాలు మిగిలితే వాటిని వండినప్పటి నుంచి 90 నిమిషాల్లోగా ఫ్రిజ్ లో పెట్టేయాలి. అంటే.. ఇప్పుడు మీరు ఏదైనా వండి తింటే.. అందులో ఏమైనా మిగిలితే.. దాన్ని 90 నిమిషాల్లోగా ఫ్రిజ్లో పెట్టాలన్నమాట. దీంతో అందులో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. బాక్టీరియా ఏర్పడకుండా ఉంటుంది.
ఇక ఒకసారి తినగా మిగిలిన ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టి తీసి మళ్లీ వేడి చేసి తినవచ్చు. కానీ అంత వరకే వాటిని అయిపోగొట్టాలి. ఆ తరువాత కూడా వాటిని ఫ్రిజ్లో పెట్టి మళ్లీ తీసి వేడి చేసి తినరాదు. వాటిల్లో అప్పటికే చాలా వరకు పోషకాలు నశించి ఉంటాయి. పైగా బాక్టీరియా కూడా చేరుతుంటుంది. కనుక ఆహారాలను ఒకసారి మాత్రమే వేడి చేయాలి. మళ్లీ మళ్లీ వేడి చేయరాదు.
ఇక ఆహారాలను వేడి చేయాల్సి వస్తే సాధారణ స్టవ్ మీద వేడి చేయాలి. కానీ మైక్రోవేవ్లను ఉపయోగించరాదు. వాటిల్లో తాజాగా వండాల్సి వస్తేనే వాటిని ఉపయోగించాలి. ఇక పాలు, మాంసం, సముద్రపు ఆహారాల విషయంలోనూ ఇవే జాగ్రత్తలను పాటించాలి. దీంతో తినే ఆహారంలో పోషకాలు కోల్పోకుండా చూసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…