Laya : ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన లయ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే సందడి మాములుగా లేదు. ఇటీవల కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న శ్లోకా.. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక లయ కూడా తన పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది.
తాజాగా నటి లయ డీజే టిల్లు మూవీ లోని సాంగ్కి అదిరిపోయే స్టెప్పులేసింది. లయ పర్ఫార్మెన్స్కి కుర్రకారు మంత్ర ముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం లయ డ్యాన్స్కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలోనే హీరోయిన్ గానూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె టాలీవుడ్లో టాప్ హీరోలందరిలోనూ కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపుగా 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఎన్నారై డాక్టర్ను పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో స్థిరపడింది.
ఒకప్పుడు తెలుగులో ఫ్యామిలీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న వారిలో లయ కూడా ఒకరు. స్టార్ హీరోలతో నటించకపోయినా.. లయ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేవి. అలాగే తన నటన కూడా అందరు మెచ్చేలా ఉండేది. 2005లో విడుదలయిన అదిరిందయ్యా చంద్రం హీరోయిన్గా లయ చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళంలోనే బిజీ అయిపోయారు లయ. రవితేజ హీరోగా, శ్రీను వైట్ల తెరకెక్కించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో మరోసారి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది లయ. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే చాలామంది ప్రేక్షకులకు లయ రీఎంట్రీ గురించి కూడా తెలీదు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న లయ.. వైరల్ అయిన కచ్చా బాదం పాటకు స్టెప్పులేసింది. ఇది ఫుల్ వైరల్ అయింది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…