Lalitha Jewellery Owner : టీవీల్లో మనకు రోజూ అనేక రకాల యాడ్స్ కనిపిస్తుంటాయి. అయితే వాటిల్లో కొన్ని యాడ్స్ మాత్రం మనల్ని అమితంగా ఆకట్టుకుంటుంటాయి. వాటిల్లో లలిత జ్యువెల్లర్స్కు చెందిన యాడ్ కూడా ఒకటి. సాధారణంగా ఏ కంపెనీ లేదా వ్యాపారం అయినా సరే సెలబ్రిటీలు, మోడల్స్ను పెట్టి యాడ్స్ తీస్తుంటారు. వాటినే ప్రసారం చేస్తుంటారు. కానీ లలిత జ్యువెల్లర్స్ కు మాత్రం స్వయంగా యజమానే యాడ్స్లో కనిపిస్తుంటారు. వాస్తవానికి ఈ ట్రిక్ బాగానే పనిచేసింది. సూటిగా సుత్తి లేకుండా తాము అందించే సేవలను ఆయన స్వయంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో లలిత జ్యువెల్లర్స్కు మంచి పేరు వచ్చింది.
లలిత జ్యువెల్లర్స్ అనగానే మనకు ముందుగా గుండులో ఉన్న ఆ సంస్థ యజమాని కిరణ్ కుమార్ గుర్తుకు వస్తారు. అంతలా ఈ సంస్థ పాపులర్ అయింది. టీవీల్లో యాడ్స్లో కనిపిస్తూ.. నగలను కంపార్ చేయమని, అలాగే డబ్బులు ఊరికే రావని ఆయన చెబుతుంటారు. అవే డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. వాటిని చాలా మంది అనుకరిస్తుంటారు కూడా. అయితే కిరణ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
లలిత జ్యువెల్లర్స్కు దేశవ్యాప్తంగా 300కు పైగా స్టోర్స్ ఉండగా.. 30వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు. ఏడాదికి రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉంటుందని.. రూ.300 కోట్ల ట్యాక్స్ కడుతున్నామని అన్నారు. ఇక మీరు ఎప్పుడూ గుండులోనే ఎందుకు కనిపిస్తారు.. అని ప్రశ్నించగా.. తాను 18 ఏళ్ల కిందట ఒకసారి తిరుపతి వెళ్లి అక్కడ గుండు చేయించుకున్నానని.. అయితే అంతకు ముందు తనకు కూడా అందరికీ ఉన్నట్లే చాలా జుట్టు ఉండేదని.. అప్పుడు తనను ఎవరూ పొగడలేదని.. కానీ గుండు చేయించుకున్న తరువాత తన లుక్ బాగుందని చాలా మంది కితాబు ఇచ్చారని అన్నారు. అయితే జుట్టు ఉన్నప్పుడూ ఎవరూ పట్టించుకోలేదు కానీ.. గుండు చేయించుకున్నాకే తాను బాగున్నానని అందరూ చెప్పారని.. అందుకనే ఆ లుక్నే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నానని.. తన గుండు వెనుక ఉన్న అసలు విషయాన్ని ఆయన చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…