Krithi Shetty : యంగ్ హీరో రామ్, బేబమ్మ కృతిశెట్టి కలసి నటించిన ది వారియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దీనికి లింగు స్వామి దర్శకుడు. ఈ మూవీ మధ్యే థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు బిలో యావరేజ్ టాక్ వస్తోంది. పైగా వర్షాలు కూడా భారీగా పడుతుండడంతో అది ఈ సినిమాపై ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా రెండో రోజే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో మూవీ డిజాస్టర్ అవుతుందేమోనని అంటున్నారు.
ది వారియర్ మూవీలో మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఫైట్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. అయినప్పటికీ థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు. ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ ఏదో మిస్ అయిందనే భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది. రొటీన్ స్టోరీ అని ఫీలవుతున్నారు. కొన్ని చోట్ల సినిమాకు నెగెటివ్ టాక్ కూడా ఎక్కువైపోయింది. అయితే తాజాగా ఈ మూవీలో కృతి శెట్టి సీన్లపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. నెటిజన్లు ఆమెను, దర్శకున్ని బాగానే ట్రోల్ చేస్తున్నారు.
ఇందులో కృతి శెట్టి నటిస్తుందనగానే ఆమె కోసం అయినా ప్రేక్షకులు వస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. అయితే ఇందులో కృతిశెట్టిని మరింత అందంగా చూపించడంలో దర్శకుడు లింగుస్వామి ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. ఈమెను గ్లామర్గా చూపించలేదనే అంటున్నారు. అలాగే కృతిశెట్టిపై క్లోజప్ షాట్స్ ఎక్కువగా పడ్డాయంటున్నారు. ఆమెను అంతలా చూపించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఆమెకు వాస్తవానికి దంతాలు కాస్త ఎత్తుగా ఉంటాయి. అయితే సినిమాలో ఆమె మూతినే బాగా చూపించారని అంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే మరో 2, 3 రోజుల్లో ఈ మూవీ ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది తేలిపోనుంది. మరి ఈ మూవీ ద్వారా రామ్ హిట్ కొడతాడా.. ఫ్లాప్లాగే మిగిలిపోతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…