Kerala Auto Driver : కేరళలో ప్రభుత్వం మెగా ఓనం లాటరీలో రూ. 25 కోట్లు గెలిచాడు ఓ ఆటో డ్రైవర్. దీంతో ఈ విషయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ లాటరీలో ఇన్ని కోట్లు గెలవడం ప్రజల్ని ఆకర్షించింది. అయితే ఇప్పుడు ఆ లాటరీ విన్నర్ అనూప్ బాధపడుతున్నాడు. నేను ఎందుకు లాటరీని గెలిచానని.. గెలవకుంటే బాగుండేదని భావిస్తున్నాడు. నేను మనశ్శాంతిని కోల్పోయాను.. ప్రస్తుతం నేను నా సొంత ఇంటిలో కూడా నివసించలేకపోతున్నానని ఆయన వాపోతున్నాడు. నేను లాటరీ గెలిచినప్పటి నుంచి ప్రజలు వాళ్ళ సమస్యలు చెబుతూ.. అవసరాలు తీర్చమని నన్ను అడగడానికి వస్తున్నారని.. నేను ఇంటికి వచ్చే వారితో ఇబ్బంది పడుతున్నాను అన్నాడు అనూప్.
రూ.25 కోట్ల లాటరీలో పన్ను, ఇతర బకాయిలు అన్ని మినహాయింపులు పోయిన తరువాత ఆయనకు ప్రైజ్ మనీగా రూ. 5 కోట్లు రానున్నాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నా.. తాను ఇప్పుడు మనశ్శాంతిని కోల్పోయానని చెపుతున్నాడు. ఈ విషయాన్ని జీ న్యూస్ లో ప్రచురించింది. నేను ఆ డబ్బులు గెలవకుంటే ఉంటే బాగుడేందనని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మందిలాగే నేను కూడా 1, 2 రోజులు వార్తల్లో నిలిచినందుకు నిజంగా ఆనందించాను. కానీ ఇప్పుడు అదే ప్రమాదంగా మారింది. ఆ డబ్బును ఏమి చేయాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు.
ప్రస్తుతానికైతే ఆ డబ్బుని రెండేళ్ల పాటు బ్యాంకులో వేస్తాను. అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఉండే బదులు కొంత తక్కువగానే ఉంటే బాగుండేది అనిపిస్తోందని ఆయన అన్నాడు. తనకు తెలిసిన చాలా మందే ఇప్పుడు శత్రువులుగా మారే అవకాశం ఉందని అనూప్ వాపోయాడు. నన్ను వెతుక్కుంటూ చాలామంది వస్తున్నారు. మా ఇంటి చుట్టుపక్కలే తిరుగుతున్నారు. దీంతో మా ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలుగుతుంది. దీంతో వారు కూడా ఇప్పుడు నాపై కోపంగా ఉన్నారు. నా మనశ్శాంతి అంతా పోయింది అని అనూప్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…