Jio 5G Phone : దేశవ్యాప్తంగా ప్రస్తుతం టెలికాం కంపెనీలు వినియోగదారులకు 5జి సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. 5జి సేవలను అందించేందుకు అవసరమైన నెట్వర్క్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే దేశంలో టెలికాం కంపెనీలు 5జి సేవలను ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక రిలయన్స్ జియో ఈ విషయంలో కాస్త ముందే ఉందని చెప్పవచ్చు.
ఇప్పటికే అనేక నగరాల్లో జియో 5జి సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు 5జి సేవలను అందించడమే లక్ష్యంగా జియో పావులు కదుపుతోంది. అందుకు అవసరమైన నెట్వర్క్ను కూడా నిర్మించుకుంటోంది. దేశంలో మొదట 13 నగరాల్లో జియో తన 5జి సేవలను అందిస్తుందని తెలుస్తోంది. ఇక 5జి సేవలను ప్రారంభించడంతోపాటు అత్యంత చవక ధరకు ఓ ఫోన్ను జియో లాంచ్ చేస్తుందని కూడా సమాచారం అందుతోంది.
జియో లాంచ్ చేస్తుందని భావిస్తున్న 5జి ఫోన్ తాలూకు ఫీచర్ల వివరాలు ప్రస్తుతం నెట్లో లీకయ్యాయి. వాటి ప్రకారం.. జియో 5జి ఫోన్లో.. స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్, 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ను రూ.10వేల లోపు ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది.
అయితే జియో లాంచ్ చేయనున్న 5జి ఫోన్కు చెందిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ ఏడాది చివరి వరకు ఒకేసారి 5జి సేవలను ప్రారంభించడంతోపాటు ఈ ఫోన్ను కూడా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…