Jayam Movie Yamini : విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ కావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో అద్భుతంగా మలిచాడు డైరెక్టర్. ఇందులో పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్, గోపీచంద్ విలనిజం, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్గా నిలిచాయి. ముఖ్యంగా ఇందులో అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్ చెల్లెలి పాత్ర అందరినీ ఆకర్షించింది. తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
సుద్ద ముక్కతో అక్షరాలను తిరగేసి రాస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఈ పాత్రకి గాను ఆ పాపకి నంది అవార్డు లభించింది. ఆ పాప పేరు.. యామిని శ్వేత. ఈమె ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. జయం చిత్రం కంటే ముందు యామిని కొన్ని సీరియల్స్ లో నటించింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న యామినికి ఓ పాప కూడా ఉంది.
అప్పట్లో యామినికి నచ్చావులే వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించింది. ఇక నంది అవార్డుకు వచ్చిన రెమ్యునరేషన్ను కూడా మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసి తన గొప్ప మనసును చాటుకుంది. ఇప్పుడు యామిని అందాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అయితే ఇప్పుడు యామిని శ్వేత సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇక ముందైనా సినిమాల్లో నటించేందుకు యామిని ఓకే చెప్తుందో లేదో చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…