Jabardasth Rakesh : ఒక్కోసారి బుల్లితెర కార్యక్రమాలను చూసే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంటాయి. ఏది నిజమో, ఏది అబద్దమో కూడా నమ్మలేని అయోమయ స్థితిలో పడేస్తూ ఉంటారు ప్రేక్షకులని. కార్యక్రమాలలో టీఆర్పీలను పెంచుకోవడం కోసం డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ టీమ్స్ వారు కొత్త పద్ధతులను అవలంబిస్తుంటారు. మల్లెమాల నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్, రష్మీ జంట, అదేవిధంగా ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ఆన్ స్క్రీన్ లో ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ తెగ ఓవరాక్షన్ చేస్తుంటారు.
కానీ వీరు బయట మాత్రం ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. వారు చేసే కార్యక్రమాల ద్వారా కేవలం వాళ్ల పాపులారిటీని పెంచుకోవడం కోసమే ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాకింగ్ రాకేష్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఉన్నాడు. రాజేష్, సుజాత జంట మాత్రం ఎప్పటికప్పుడు ఆన్ స్క్రీన్ మీద కాకుండా ఆఫ్ స్క్రీన్ మీద కూడా రెచ్చిపోతున్నారు. ఒకరిపై ఒకరు ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో రెచ్చిపోవడమే కాకుండా గోవా బీచ్ లో కూడా తెగ హంగామా చేశారు.
మొన్నటికి మొన్న వరలక్ష్మీ వ్రతం అంటూ రాకేష్ ఇంట్లో సుజాత తెగ హడావిడి చేసింది. శ్రావణ సందడి అనే కార్యక్రమంలో అనసూయ, రవి వ్యాఖ్యాతగా సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ గా అందాల రాక్షసి ఫేమ్ హీరో నవీన్ చంద్ర కూడా పాల్గొన్నాడు. శ్రావణ సందడి కార్యక్రమంలో కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు, మరికొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా సుజాత, రాకేష్ తమ లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ అందరి ముందు రెచ్చిపోయారు.
షో కోసం షో చేసే లవ్ కాదు.. నిజమైన ప్రేమ మాది. జీవితాంతం కలిసి ఉంటామని రాకేష్ చెబుతుంటే, సుజాత ఇంకా రెచ్చిపోతూ రాకేష్ ని కౌగిలించుకొని ముద్దులు పెట్టేసింది. ఇది కేవలం పబ్లిసిటీ కోసమా.. లేక వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. అనే విషయం వేచి చూస్తే తెలుస్తుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…