Tollywood : ప్రస్తుతం సినిమా రంగంలో ఓటీటీల హవా నడుస్తోంది. ఇందుకు తగ్గట్టు ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతూ వస్తున్నాయి. వారు ఓటీటీల్లో అన్ని రకాల అంశాలు, సున్నితమైన భావోద్వేగాలు, రొటీన్ కి భిన్నంగా కథ కథనాలు ఉన్న సినిమాలను, వెబ్ సిరీస్ లను ఆదరిస్తున్నారు. కానీ మన తెలుగు సినిమా దర్శకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరుస చిత్రాల్లో ఒకే రకమైన హీరో పాత్రలతో మూస ధోరణిలో సినిమాలు తీస్తూ పరాజయాల్ని మూటగట్టుకుంటున్నారు.
ఇదివరకు మన తెలుగు హీరోలందరూ సినిమాల్లో ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్ల ని పోషించేవారు. ఒకప్పుడు అది ఒక విజయమంతమైన సినీ ఫార్ములా. కానీ ఇప్పుడు కథానాయకులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా దర్శనం ఇస్తున్నారు. ఇది హీరో నాని నటించిన టక్ జగదీష్ తో మొదలైంది. ఇందులో ఆయన ఎమ్మార్వోగా నటించాడు. అలాగే రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీ మూవీలో ఈయన కూడా డిప్యూటీ కలెక్టర్ గా, ఎమ్మార్వోగా నటించాడు. ఇక తాజాగా నితిన్ కూడా తన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐఎఎస్ ఆఫీసర్ లా, జిల్లా కలెక్టర్ పాత్రని పోషించాడు.
అయితే తప్పంతా ఇలాంటి పాత్రలని ఎంచుకోవడంలో లేదని, ఇటువంటి పాత్రలని తీసుకున్నప్పుడు వారిని అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, ఫైట్లు చేస్తున్నట్టుగా, మందు తాగే వాళ్ల లాగా, రొటీన్ మాస్ మసాలా ఫార్ములా సినిమాను తీసే విధానంలోనే లోపాలు ఉంటున్నాయని సినీ నిపుణుల అభిప్రాయంగా తెలుస్తోంది. అయినప్పటికీ బోరింగ్ కథా కథనాలతో ఈ సినిమాల్లో ఏ ఒక్కటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
అయితే ఈ విషయంలో బాలీవుడ్ సినిమాలు మన కంటే కాస్త మెరుగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు. అక్కడ హీరో ఆయుష్మాన్ ఖురానా పోలీస్ డిటెక్టివ్ గా నటించిన అనేక్, ఆర్టికల్ 15 సినిమాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. రాజ్ కుమార్ రావ్ హీరోగా చేసిన న్యూటన్ సినిమాలో ఎలక్షన్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాల్లో వీరు బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారుల పాత్రల్ని పోషించారు. వీరు సున్నితమైన అంశాలను ఎంతో చక్కగా చూపించి ప్రశంసలు అందుకున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే తెలుగు చిత్రాలపై ప్రేక్షకులకు విరక్తి చెందే అవకాశం లేకపోలేదు. ఇకనైనా మన తెలగు దర్శకులు, నిర్మాతలు రొటీన్ మాస్ మసాలా ఫార్ములా కథలు కాకుండా సరికొత్తగా ఆలోచించి మంచి సినిమాలను అందించాలని కోరుకుందాం.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…