Jabardasth Show : బుల్లితెరపై ఎంతో సక్సెస్ సాధించిన షోలలో జబర్దస్త్ ఒకటి. జబర్దస్త్ షో వస్తుందంటే చాలు.. ఇంటిల్లిపాదీ ఒకప్పుడు ఎంతో ఇష్టంగా చూసేవారు. కానీ ఈ షోకు రాను రాను కళ తప్పింది. బూతును ప్రయోగించడమే పరమావధిగా మారింది. అయినప్పటికీ ఈ షోకు రేటింగ్స్ తగ్గలేదు. తరువాత ఎక్స్ట్రా జబర్దస్త్ను తీసుకొచ్చారు. ఒక షోకు అనసూయ, ఇంకో దానికి రష్మి గౌతమ్ యాంకర్లుగా చేస్తున్నారు. తరువాత జడ్జిగా నాగబాబు దూరమయ్యారు. కొంత కాలానికి రోజా కూడా దూరమయ్యారు. ఇప్పుడు కమెడియన్లు కూడా దూరమవుతున్నారు. దీంతో జబర్దస్త్ షో ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
స్టార్ కమెడియన్లు అందరూ ప్రస్తుతం ఇతర టీవీలలో వచ్చే షోలలో కనిపిస్తున్నారు. అందరూ జబర్దస్త్లో పనిచేసేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. ఈ క్రమంలోనే సుధీర్, శ్రీను, ఆది వంటి వారు ఈ షోకు దూరమయ్యారు. త్వరలోనే రెండు షోలను తీసేసి ఒక షోనే ఉంచుతారని.. దానికి రష్మిని యాంకర్గా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ షో ఇక నిలిచిపోతుందనే వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై నిర్వాహకులు మల్లెమాల సంస్థ వారు స్పందించారు.
జబర్దస్త్ షో నిలిచిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎంతో మంది కమెడియన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కొత్తవారితో అయినా సరే ఈ షోను నడిపిస్తాం. కానీ ఆపే ప్రసక్తే లేదు. ఈ షో ను ఆపేస్తున్నామని వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. కాగా జబర్దస్త్ షోకు ఈ మధ్య కాలంలో రేటింగ్స్ కూడా బాగా తగ్గాయి. దీంతో చీప్ ట్రిక్స్ ప్లే చేసి రేటింగ్స్ రాబట్టాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇంత చేసినప్పటికీ ఈ షోకు ప్రస్తుతం కళ తప్పిందనే చెప్పవచ్చు. అసలే స్టార్ కమెడియన్లు దూరమై కష్టాల్లో ఉన్న జబర్దస్త్ మళ్లీ తిరిగి పూర్వ స్థితిని సొంతం చేసుకోవాలంటే.. కొంత కాలం వేచి చూడక తప్పదు. అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…