Ira Khan : మే 3న దేశమంతటా రంజాన్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ముస్లింలు ఈ వేడుకని సంతోషంగా జరుపుకున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ పండుగ సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. ఇక ఈద్ సందర్భంగా అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్.. ఫోటోలతో హల్ చల్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్లో కజిన్స్, బాయ్ఫ్రెండ్ నూపుర్ శిఖరేతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు దిగిన ఫోటోలు హాట్ టాపిక్గా మారాయి.
ఫొటోలలో ఐరా ఆకుపచ్చ రంగు లెహంగాలో కనిపించగా, బాయ్ ఫ్రెండ్ మాత్రం కుర్తాలో కనిపించాడు. తన ఫొటోలకి.. పెళ్లయ్యే వరకు మీరు ఈదీకి అర్హులని మీకు తెలుసా ?! 18 ప్లస్ అయితే.. మీరు పెద్దోళ్లగా పరిగణిస్తారు. మీరు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. ఈద్ ముబారక్.. అంటూ పేర్కొన్నది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
పండుగ రోజు ఇలాంటి పిచ్చి బట్టలు ఏంది.. అని మండిపడుతున్నారు. కొందరు మాత్రం అమ్మడి అందాలని ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే ఐరా చేసిన ఓ పోస్టు కూడా తెగ హల్ చల్ చేసింది. తాను వింత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ లో తనకున్న వ్యాధి గురించి అభిమానులతో పంచుకుంది. ఓ ఎమోషనల్ పోస్టు ద్వారా తన బాధను వివరించింది. ఓ జబ్బు వల్ల హార్ట్ బీట్ సరిగ్గా ఉండదు. ఊపిరితీసుకోలేకపోవడం, ఏడుపు.. ఇవి యాంగ్జైటీ ఎటాక్ లక్షణాలు. అవి చాలా మెల్లమెల్లగా వస్తుంటాయి. పెరిగి పెద్దవుతాయి. ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది.. అని చెప్పింది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…