IPL 2022 : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తోంది. కరోనా కాస్త తగ్గడంతో స్టేడియంలలోకి ప్రేక్షకులని కూడా అనుమతిస్తున్నారు. శుక్రవారం ముంబైలోని వాంఖెడె స్టేడియంలో కోల్కతా-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోల్కతా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే చేధించింది. లక్ష్య చేధనలో కోల్కతా మొదట తడబడినప్పటికీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్తో మ్యాచ్లో నెగ్గింది. రసెల్ 31 బంతుల్లో 8 సిక్స్లు, 2 ఫోర్లతో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
శ్రేయాస్ అయ్యర్ 25 (15), సామ్ బిల్లింగ్స్ (23) పరుగులు చేశారు. అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ మ్యాచ్లో కేకేఆర్కి మద్దతుగా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, లైగర్ బ్యూటీ అనన్య పాండే తెగ హడావిడి చేశారు. పంజాబ్ కింగ్స్ పవర్ హిట్టర్ షారుక్ ఖాన్ అవుట్ కావడంతో సుహానా ఖాన్, అనన్య పాండే ఇద్దరూ సంతోషంగా కనిపించారు. చప్పట్లు కొడుతూ, ఎగురుతూ సందడి చేశారు. కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షారుక్ ఖాన్.. ఐదు బంతులు ఆడి సున్నాకి ఔట్ అయ్యాడు. అతడిని టిమ్ సౌథీ క్యాచ్ అవుట్ చేశాడు.
వాంఖెడె స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్ బ్యాట్స్మెన్.. తొలి నుంచే తడబాటుకు గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. పంజాబ్ టీమ్లో రాజపక్స మాత్రమే రాణించాడు. 9 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేసి 31 పరుగులు చేశాడు. రబడ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. లివింగ్స్టోన్ (19), ధావన్ (16) కొట్టారు. మొత్తంగా 18 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయిన పంజాబ్ టీమ్.. 137 పరుగులు చేసి 138 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా ముందు ఉంచింది. రసెల్ విజృంభణతో ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…