IPL 2022: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నీ 22వ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై చెన్నై విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగళూరు చివరి వరకు పోరాడింది. కానీ లక్ష్య సాధనకు కొన్ని పరుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో బెంగళూరుపై చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎట్టకేలకు చెన్నై ఈ సీజన్లో బోణీ కొట్టింది. దీంతో చెన్నై ఫ్యాన్స్ హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్మెన్లలో శివమ్ దూబె 95 పరుగులు చేసి రెచ్చిపోగా.. చివరికి నాటౌట్గా మిగిలాడు. అలాగే రాబిన్ ఊతప్ప కూడా 88 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బెంగళూరు బౌలర్లలో హసరంగ 2 వికెట్లు తీయగా.. హేజల్వుడ్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. చివరి ఓవర్ వరకు బెంగళూరు బ్యాట్స్మెన్ అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డ్ను ఉరకలెత్తించా. కానీ చివరికి చేయాల్సిన పరుగులు భారీగా పెరిగిపోయాయి. దీంతో బ్యాట్స్మెన్ చివర్లో చేతులెత్తేశారు. ఈ క్రమంలో చెన్నై జట్టును విజయం వరించింది. ఇక బెంగళూరు బ్యాట్స్మెన్లలో షాబాజ్ అహ్మద్ (41 పరుగులు), సూయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్లు చెరో 34 పరుగుల చొప్పున చేశారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఇక చెన్నై బౌలర్లలో మనీష్ 4 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. ముకేష్ చౌదరి, బ్రేవోలకు చెరొక వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…