India vs Newzealand : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో జరిగిన పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్పై గెలిచింది. ఆ జట్టు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ కష్టపడుతూ ఛేదించింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ క్రమంలో న్యూజిలాండ్పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో మార్టిన్ గప్తిల్, మార్క్ చాప్మన్లు అర్ధ సెంచరీలతో రాణించారు. 42 బంతులు ఆడిన గప్తిల్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేయగా.. మార్క్ చాప్మన్ 50 బంతులు ఆడి 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్లు 2 వికెట్ల చొప్పున తీశారు. దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్ లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మలు రాణించారు. 40 బంతులు ఆడిన యాదవ్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, 36 బంతుల్లో రోహిత్ శర్మ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. టిమ్ సౌతీ, మిచెల్ శాన్టనర్, డెరిల్ మిచెల్లకు తలా 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో విజయంతో ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మరో 2 టీ20లు జరగనున్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…