Heart Attack : పిడికెడంత గుండె మన శరీరాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటుంది. శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తూ నిరంతరం అలుపు ఎరుగని యోధుడిలా పని చేస్తూనే ఉంటుంది. కానీ కొందరు అనారోగ్యకరమైన జీవనశైలితో, చెడు వ్యసనాలతో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలతో తమ చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే గుండె మన శరీరంలో నిరంతరం పనిచేసే ముఖ్యమైన భాగాలలో ఒకటి. నేటి కాలంలో గుండె సంబంధిత సమస్యల వలన అనేక మంది మరణించడం జరుగుతోంది.
ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారిలో 35 నుంచి 40 సంవత్సరాల వయస్సులోని ప్రజలు ఎక్కువగా గుండెపోటు సమస్యకు గురవుతున్నారు. మారుతున్న జీవన శైలిని బట్టి అధిక రక్తపోటు తలెత్తడం, గుండెకు ప్రసారమయ్యే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, అధిక బరువు వంటి సమస్యల వలన గుండెపోటు రావడం, గుండె పెరిగిపోవడం ఈ సమస్యలు తలెత్తుతూ చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ కారణం మన జీవనశైలి, తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే అని చెప్పవచ్చు.
ఎప్పుడైతే గుండె బలహీనంగా ఉంటుందో మనకు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలలో మొదటిది వికారం, ఛాతిలో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎప్పుడైతే మన గుండె బలహీనంగా ఉంటుందో రక్తపోటు అనేది మన అదుపులో ఉండదు. రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడితే గుండె పోటు సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి కనిపిస్తే రక్తపోటును అనేది ఏ స్థాయిలో ఉంది అని తనిఖీ చేయించుకోవడం ఎంతో అవసరం. గుండె ఎప్పుడు బలహీనంగా ఉంటుందో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. అంతే కాకుండా నిరంతర జలుబు సమస్య అనేది గుండె బలహీనతకు ఒక లక్షణంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయో గుండె బలహీనంగా ఉందని సూచనలు కనిపిస్తాయి. వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గి ఈ సమస్యలు మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే సమస్య తీవ్రంగా ఉంది అనిపిస్తుందో వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఎంతో ఉత్తమం.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…