Currency Notes : సాధారణంగా మన వద్దకు అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన నాణేలు, నోట్లు వస్తుంటాయి. వాటిని చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే వాటిని ఆన్లైన్లో విక్రయించాలనే కానీ లక్షల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. అలాంటి కాయిన్స్, కరెన్సీ నోట్లను విక్రయించే సైట్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా అలాంటి నాణేలు, నోట్లను మనం సులభంగా విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఇక అలాంటి నోట్లలో 786 అనే నంబర్ ఉన్న నోట్లు ఒకటి. ఈ నంబర్ను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నంబర్ ఉన్న నోట్లు తమ వద్ద ఉంటే అదృష్టం కలసి వస్తుందని.. అనుకున్నవి నెరవేరుతాయని.. ధనవంతులు అవుతారని విశ్వసిస్తారు. కనుకనే ఈ నంబర్ ఉండే నోట్లను చాలా మంది కొంటుంటారు. ఇక ఇలాంటి నోట్లు మీ దగ్గర కూడా ఉంటే అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.
786 అనే నంబర్లో ఉండే నోట్లను విక్రయించాలంటే అందుకు ఈబే అనే సైట్ను సందర్శించాలి. అందులో రిజిస్టర్ అయ్యాక లాగిన్ అవ్వాలి. మీ దగ్గర ఉండే నోట్లకు చెందిన ఫొటోలను తీసి అందులో యాడ్ పెట్టాలి. అప్పుడు కావల్సిన వారు ఆ నోట్లను కొంటారు. మీకు డబ్బు చెల్లిస్తారు. ఇలా ఈ నోట్లను అమ్మవచ్చు.
ఇక మాతా వైష్ణోదేవికి ఫొటోతో కూడిన నాణేలను 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి చాలా అరుదైన కాయిన్స్. వీటిని అధిక ధరలకు చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ నాణేలను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని.. ధనం బాగా సంపాదించవచ్చని నమ్ముతారు. కనుకనే ఈ నాణేలను కూడా చాలా మంది కొంటున్నారు. ఇక ఈ నాణేలు మీ దగ్గర ఉంటే కాయిన్ బజార్ అనే సైట్లో వీటిని విక్రయించి డబ్బులు పొందవచ్చు. ఇలా మీ దగ్గర ఉండే ప్రత్యేక నాణేలు, నోట్లతోపాటు పాత కాయిన్స్ ను, నోట్లను కూడా ఆయా సైట్లలో విక్రయించి డబ్బులు సంపాదించవచ్చు. అయితే వీటిని అమ్మేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తలు పాటించండి. లేదంటే సైబర్ నేరగాళ్ల బారిన పడతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…