Hyderabad : ప్రస్తుతం కరోనా కారణం వల్ల పిల్లలకి ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్ జీవితానికి అంకితమయ్యారు. ఈ క్రమంలోనే పిల్లలు ఎక్కువ సమయం సెల్ ఫోన్ లోనే గడుపుతున్నారు. తరగతి గదులు పూర్తయినప్పటికీ సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఫోన్లకి పరిమితమవుతున్నారు. ఇలా సెల్ ఫోన్ కి పరిమితమైన ఒక కూతురిని తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్లోని మీర్పేటలో సర్వోదయ నగర్ లో నివాసం ఉండే ఒక బాలిక పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే సెల్ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడటం వల్ల తన తండ్రి తనని మందలించాడు. అయితే తండ్రి మందలించాడనే మానసిక వేదనతో ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఆ బాలిక కఠినమైన నిర్ణయం తీసుకుంది.
కేవలం తన తండ్రి మందలించాడనే కోపంతోనే ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…