Hyderabad : ప్రస్తుతం కరోనా కారణం వల్ల పిల్లలకి ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్ జీవితానికి అంకితమయ్యారు. ఈ క్రమంలోనే పిల్లలు ఎక్కువ సమయం సెల్ ఫోన్ లోనే గడుపుతున్నారు. తరగతి గదులు పూర్తయినప్పటికీ సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఫోన్లకి పరిమితమవుతున్నారు. ఇలా సెల్ ఫోన్ కి పరిమితమైన ఒక కూతురిని తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్లోని మీర్పేటలో సర్వోదయ నగర్ లో నివాసం ఉండే ఒక బాలిక పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే సెల్ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడటం వల్ల తన తండ్రి తనని మందలించాడు. అయితే తండ్రి మందలించాడనే మానసిక వేదనతో ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఆ బాలిక కఠినమైన నిర్ణయం తీసుకుంది.
కేవలం తన తండ్రి మందలించాడనే కోపంతోనే ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…