Nellore Chepala Pulusu : మాంసాహార ప్రియుల్లో చాలా మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. చేపల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. శరీరానికి కావల్సిన పోషణను అందిస్తాయి. అయితే చేపలతో చాలా మంది పులుసు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరు చేపల పులుసు అన్నా కూడా చాలా మంది ఇష్టపడతారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెల్లూరు చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – అరకిలో, నువ్వులనూనె – 6 టేబుల్స్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, మెంతులు – అర టీస్పూన్, మిరియాలు – అర టీస్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – 2 రెబ్బలు, వెల్లుల్లి పాయలు – 5, అల్లం ముక్క – చిన్నది, పచ్చిమిర్చి – 4, ఉల్లిగడ్డ – 1, చింతపండు- పెద్ద నిమ్మకాయ సైజంత, టమాటాలు – 6, పసుపు – టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ధనియాల పొడి – 3 టీస్పూన్లు, ఉప్పు – తగినంత.
నెల్లూరు చేపల పులుసును తయారు చేసే విధానం..
పాన్లో నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. మెత్తగా దంచిన అల్లం, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. చింతపండును రెండు కప్పుల నీటిలో 20 నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో చింతపండు రసం, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. అవసరమైతే మరో రెండుకప్పుల నీళ్లు పోసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని వేయించిన ఉల్లిపాయల మిశ్రమంలో పోయాలి. సన్నని సెగపై అరగంటపాటు ఉడికించాలి. గ్రేవీ ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి. కూర ఉడుకుతున్న సమయంలోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలను వేయించి పొడి చేసుకోవాలి. ఈ మసాలపొడిని కూరలో వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ అవుతుంది. దీన్ని అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…