Nellore Chepala Pulusu : మాంసాహార ప్రియుల్లో చాలా మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. చేపల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. శరీరానికి కావల్సిన పోషణను అందిస్తాయి. అయితే చేపలతో చాలా మంది పులుసు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరు చేపల పులుసు అన్నా కూడా చాలా మంది ఇష్టపడతారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెల్లూరు చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – అరకిలో, నువ్వులనూనె – 6 టేబుల్స్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, మెంతులు – అర టీస్పూన్, మిరియాలు – అర టీస్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – 2 రెబ్బలు, వెల్లుల్లి పాయలు – 5, అల్లం ముక్క – చిన్నది, పచ్చిమిర్చి – 4, ఉల్లిగడ్డ – 1, చింతపండు- పెద్ద నిమ్మకాయ సైజంత, టమాటాలు – 6, పసుపు – టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ధనియాల పొడి – 3 టీస్పూన్లు, ఉప్పు – తగినంత.
నెల్లూరు చేపల పులుసును తయారు చేసే విధానం..
పాన్లో నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. మెత్తగా దంచిన అల్లం, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. చింతపండును రెండు కప్పుల నీటిలో 20 నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో చింతపండు రసం, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. అవసరమైతే మరో రెండుకప్పుల నీళ్లు పోసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని వేయించిన ఉల్లిపాయల మిశ్రమంలో పోయాలి. సన్నని సెగపై అరగంటపాటు ఉడికించాలి. గ్రేవీ ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి. కూర ఉడుకుతున్న సమయంలోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలను వేయించి పొడి చేసుకోవాలి. ఈ మసాలపొడిని కూరలో వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ అవుతుంది. దీన్ని అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…